Site icon HashtagU Telugu

Trisha Gongadi: టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి రికార్డు.. 53 బంతుల్లోనే సెంచ‌రీ!

Trisha Gongadi

Trisha Gongadi

Trisha Gongadi: అండర్-19 మహిళల టీ-20 ప్రపంచకప్‌లో భారత్, స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా క్రీడాకారిణి గొంగడి త్రిష అద్భుత ప్రదర్శన చేసింది. త్రిష సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. అండర్-19 మ‌హిళ‌ల టీ20 ప్రపంచకప్ 2025లో భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ త్రిష గొంగడి (Trisha Gongadi) సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ టోర్నీ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో మంగళవారం (జనవరి 28) స్కాట్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది. త్రిష 59 బంతుల్లో 110 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. ఈ సమయంలో ఆమె 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాదింది. త్రిష ఈ ఇన్నింగ్స్‌లో ఆమె స్ట్రైక్ రేట్ 186.44. భద్రాచలం (తెలంగాణ)కు చెందిన త్రిష గొంగడి మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన ఘనత సాధించింది. అంతకుముందు ఇంగ్లండ్ క్రీడాకారిణి గ్రేస్‌ స్క్రీవెన్స్‌ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 93 పరుగులు చేసింది.

త్రిష ఈ తుఫాను ఇన్నింగ్స్‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. త్రిష ఇన్నింగ్స్ కార‌ణంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 208/1 పరుగులు చేసింది. త్రిషకు మ‌రో ఓపెనర్, వికెట్ కీపర్ కమలినీ గుణాలన్ నుండి అద్భుతమైన మద్దతు లభించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించారు. కమలిని (51) ప‌రుగులు చేసి ఔటయ్యారు. సూపర్ సిక్స్‌లోని ఈ మ్యాచ్‌లో త్రిష, కమిలనీతో పాటు సానికా చాల్కే కూడా 29 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. స్కాట్లాండ్‌ తరఫున అమాసి మస్సెరాకు ఏకైక వికెట్ దక్కింది. మ్యాచ్ ఆద్యంతం స్కాట్లాండ్ బౌలర్లు ఇబ్బంది పడుతూనే కనిపించారు.

Also Read: Smriti Mandhana: మహిళల క్రికెట్ లోనూ భారత్ జోరు.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి

ICC మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోర్లు (వ్యక్తిగతం)