Site icon HashtagU Telugu

Indian Players: ఈ ముగ్గురు ఆటగాళ్ల‌పైనే టీమిండియా ఆశ‌లు.. లిస్ట్‌లో ఇద్ద‌రూ ఆల్ రౌండ‌ర్లు!

Indian Players

Indian Players

Indian Players: పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా (Indian Players) మళ్లీ సిరీస్‌లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించాలని కివీస్ జట్టు ప్రయత్నిస్తోంది. అయితే, భారత జట్టులోని 3 ఆటగాళ్లు కివీ జట్టు సమస్యలను పెంచే అవ‌కాశం ఉంది.

విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి ఫామ్‌లోకి వ‌చ్చాడు. పుణెలో అతని రికార్డు అద్భుతంగా ఉంది. పుణెలో 2 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 3 ఇన్నింగ్స్‌ల్లో 133.50 సగటుతో 267 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ స్కోరును ఇక్కడే నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 254* పరుగులు చేశాడు.

Also Read: Konda Surekha: మ‌రోసారి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్‌.. ఈసారి ఎవ‌రికంటే?

ఆర్ అశ్విన్

పుణె పిచ్‌పై స్పిన్నర్లకు సహాయం అందుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో అశ్విన్ ప్రకంపనలు సృష్టించవచ్చు. ఈ మైదానంలో ఆడిన 2 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇది కాకుండా న్యూజిలాండ్‌పై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. పుణెలో 182 పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో కివీస్ జట్టు ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.

రవీంద్ర జడేజా

ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో రవీంద్ర జడేజా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లాదేశ్‌పై అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇదే సమయంలో కివీ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పుణెలో అతని రికార్డు గురించి మాట్లాడుకుంటే.. అతను 2 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 96 పరుగులు చేశాడు. ఈ మైదానంలో అతని అత్యధిక స్కోరు 92 పరుగులు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గడ్డపైనే తొలి మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా అనుకుంటున్నారు.