Site icon HashtagU Telugu

Team India: ఆసియా క‌ప్ 2025.. ఈనెల 19న టీమిండియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

Asia Cup

Asia Cup

Team India: ఆసియా కప్ 2025 కోసం టీమ్ ఇండియా (Team India) జట్టును ఎంపిక చేసే ప్రక్రియ ఊపందుకుంది. సెప్టెంబర్ 9 నుండి టోర్నమెంట్ ప్రారంభం కానుండగా భారత జట్టును ఆగస్టు 19న ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి ఆసియా కప్ టీ-20 ఫార్మాట్‌లో జరగనుంది. దీనికి గాను సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఉప కెప్టెన్ బాధ్యతలు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. శుభ్‌మన్ గిల్ లేదా అక్షర్ పటేల్‌లలో ఒకరికి ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

జట్టులో కీలక మార్పులు

తిరిగి రానున్న ఆటగాళ్లు: గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం దాదాపు ఖాయం. అలాగే శుభ్‌మన్ గిల్ కూడా టీ-20 జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వికెట్ కీపర్: వికెట్ కీపర్ పాత్ర కోసం సంజూ శాంసన్ మొదటి ఎంపిక కావచ్చు. అతనికి బ్యాకప్‌గా జితేష్ శర్మను ఎంపిక చేయవచ్చు.

Also Read: Telangana Jagruti: ఎమ్మెల్సీ క‌విత కీల‌క నిర్ణ‌యం.. త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి!

పక్కకు తప్పుకునే ఆటగాళ్లు: గాయం కారణంగా రిషభ్ పంత్ జట్టులో ఉండడు. అదేవిధంగా యశస్వీ జైస్వాల్‌కు కూడా జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లను ఎంపిక చేసే అవకాశం ఉంది. నీతీష్ కుమార్ రెడ్డీ ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టులో చోటు దక్కించుకోవడం కష్టం కావచ్చు.

అనిశ్చితిలో ఉన్న ఆటగాళ్లు: స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే రింకూ సింగ్ ఫామ్‌ను బట్టి అతన్ని ఎంపిక చేస్తారా లేదా అనేది కూడా సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది.

టీమ్ ఇండియా షెడ్యూల్