Team India: భారత క్రికెట్ జట్టు (Team India) ఇప్పటికీ బార్బడోస్లో చిక్కుకుపోయింది. బార్బడోస్లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 29, శనివారం జరిగింది. అయితే అక్కడి తుఫాన్ ప్రభావం వలన టీమ్ ఇండియా బార్బడోస్లో ఉండవలసి వచ్చింది. తుఫాను కారణంగా బార్బడోస్ విమానాశ్రయం మూతపడింది. ప్రస్తుతం బార్బడోస్లో కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. గత మంగళవారం అక్కడి నుంచి టీమ్ ఇండియా బయలుదేరాల్సి ఉండగా ఆలస్యమైంది.
ఒక రోజు క్రితం వచ్చిన మీడియా నివేదికలలో టీమ్ ఇండియా కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసిందని, అందువల్ల టీమిండియా తిరిగి రావడానికి మంగళవారం బయలుదేరి బుధవారం సాయంత్రంలోగా ఢిల్లీకి చేరుకుంటుందని పేర్కొంది. అయితే ఇప్పుడు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
Also Read: Babar Azam: బాబర్ ఆజంకు అవమానం.. నేపాల్ జట్టులోకి కూడా తీసుకోరని కామెంట్స్..!
స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ ఎక్స్ ద్వారా మాట్లాడుతూ టీమ్ ఇండియా ఈపాటికి ఢిల్లీకి చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి ఉండాల్సిందని, అయితే అది మరింత ఆలస్యం అవుతోందన్నారు. స్వదేశానికి రావడం కంటే ప్రపంచకప్ గెలవడం సులభమని కూడా ఆయన పేర్కొన్నాడు. అయితే ఇప్పటివరకు టీమ్ ఇండియాకు సంబంధించి బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. బార్బడోస్ నుంచి టీమ్ ఇండియా ఎప్పుడు పునరాగమనం చేస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
We’re now on WhatsApp : Click to Join
2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఫైనల్లో ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. భారత్ ఈ ఓటమితో కోట్లాది మంది అభిమానులు గుండెలు బాదుకున్నారు. ఆ తర్వాత తాజాగా 2024 టీ20 ప్రపంచకప్ను గెలవడం ద్వారా రోహిత్ సేన అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. 17 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియాకు ఇది రెండో టీ20 ప్రపంచకప్. అంతకుముందు 2007లో మెన్ ఇన్ బ్లూ టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్న విషయం తెలిసిందే.