Site icon HashtagU Telugu

Old Trafford: మాంచెస్ట‌ర్‌లో భార‌త్‌ను దెబ్బ కొట్టేందుకు ఇంగ్లాండ్ ‘గడ్డి’ వ్యూహం!

Old Trafford

Old Trafford

Old Trafford: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో ఉంది. లార్డ్స్‌లో చోటుచేసుకున్న పరాజయం టీమ్ ఇండియాను సిరీస్‌లో వెనక్కి నెట్టింది. సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ కీలక నాల్గవ టెస్ట్ బుధవారం నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford) లో ప్రారంభం కానుంది. సిరీస్‌లో వెనుకబడి ఉండటంతో పాటు.. భారత జట్టును గాయాల బెడద వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

గాయాల బెడదతో బలహీనపడిన భారత్

ఆల్‌రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల నుంచి తప్పుకోగా.. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నాల్గవ టెస్ట్‌కు అందుబాటులో ఉండడు. కీలక బౌలర్లు గాయపడటంతో భారత బౌలింగ్ దాడి బలహీనంగా కనిపిస్తోంది. అంతేకాదు బ్యాటింగ్‌లో కూడా ఆ లోతు కనిపించడం లేదు. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈ పరిస్థితిని ఆతిథ్య జట్టు సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లండ్‌లో భారత్ సిరీస్ గెలవాలనే కలను నెరవేరనివ్వకుండా అడ్డుకున్న తమ పాత వ్యూహాన్ని ఇంగ్లండ్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో అమలు చేయడానికి సిద్ధమవుతోంది.

Also Read: UPI payments : కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి యూపీఐ కొత్త నిబంధనలు

ఇంగ్లీష్ జట్టు ‘గడ్డి’ వ్యూహం?

నాల్గవ టెస్ట్ మ్యాచ్ పిచ్ మొదటి చిత్రం బయటకు వచ్చింది. మొదటి పిక్‌లో పిచ్‌పై ఆకుపచ్చ గడ్డి పుష్కలంగా కనిపిస్తోంది. ఆకుపచ్చ గడ్డి అంటే వేగవంతమైన బౌలర్లకు చాలా సహాయం చేస్తుందని అర్థం. మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో బ్యాట్స్‌మెన్‌ల ఆధిపత్యం కనిపించినప్పటికీ.. సిరీస్‌లోని ఈ కీలక మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు పెద్ద ఆట ఆడవచ్చు.

భారత్ అనేక ప్రధాన పేస్ బౌలర్లు గాయపడిన విషయాన్ని ఇంగ్లండ్ జట్టుకు తెలుసు. టీమ్ ఇండియా బౌలింగ్ దాడి నాల్గవ టెస్ట్‌లో అంత బలంగా ఉండదు. ఈ కారణాన్ని దృష్టిలో ఉంచుకుని కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆకుపచ్చ పిచ్‌ను కోరవచ్చు. అయితే మొదటి మూడు మ్యాచ్‌లలో కూడా మొదటి చిత్రంలో పిచ్‌పై గడ్డి ఇలాగే కనిపించినా, తర్వాత దానిని కత్తిరించారు. మరి ఈసారి ఇంగ్లండ్ నిజంగానే పేస్ పిచ్‌ను సిద్ధం చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక‌పోతే సిరీస్‌లో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. నాల్గ‌వ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై గెలిచి భార‌త్ సిరీస్‌ను సమం చేయాల‌ని భావిస్తోంది.