Ind Vs SA 1st innings:సఫారీలను బెంబేలెత్తించిన అర్ష్ దీప్, చాహార్

టీ ట్వంటీ భారత యువ పేసర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్లను తమ పేస్ తో బెంబేలెత్తించారు.

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 08:50 PM IST

తిరువనంతపురం: టీ ట్వంటీ భారత యువ పేసర్లు చెలరేగిపోయారు. సఫారీ బ్యాటర్లను తమ పేస్ తో బెంబేలెత్తించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా 106 పరుగులకు పరిమితమయింది. ఒక దశలో కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఎందుకంటే భారత్ బౌలర్లు ఓ రేంజ్ లో ఆ జట్టు బ్యాటింగ్ ను దెబ్బ తీశారు. అర్ష్ దీప్ , దీపక్ చాహర్ ధాటికి సౌతాఫ్రికా కేవలం 2.3 ఓవర్లలో 9 రన్స్ కే సగం వికెట్లు కోల్పోయింది. ఈ అయిదు వికెట్లలో నలుగురు డకౌట్ అయ్యారు.
తొలి ఓవర్‌ చివరి బంతికే సౌతాఫ్రికా కెప్టెన్‌ బవుమాను ఔట్‌ చేసి దీపక్‌ చహర్‌ శుభారంభం అందించాడు. ఇక రెండో ఓవర్లో అర్ష్‌దీప్‌ సింగ్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో రెండు, ఐదు, ఆరు బంతులకు ముగ్గురు సఫారీ బ్యాటర్లను ఔట్‌ చేశాడు. అతని దెబ్బకు డికాక్‌ , రూసో , మిల్లర్‌ ఔటయ్యారు. ఆ తర్వాతి ఓవర్లో చహర్‌.. స్టబ్స్‌ ను కూడా ఔట్‌ చేయడంతో సౌతాఫ్రికా 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మక్రమ్ 25, పార్నెల్ 24 రన్స్ తో ఆదుకున్నారు. తర్వాత కేశవ్ మహారాజ్ 41 రన్స్ చేయడంతో స్కోరు 100 దాటింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 , దీపక్ చహార్ 2 , హర్షల్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.
ఈ మ్యాచ్ లో భారత్ బుమ్ర , చాహల్ కు రెస్ట్ ఇచ్చింది. వికెట్ కీపర్లు రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

Pic Courtesy: BCCI/Twitter