Site icon HashtagU Telugu

Shubman Gill Injury: గిల్ గాయంపై బిగ్ అప్డేట్ ఇచ్చిన బీసీసీఐ!

Shubman Gill Injury

Shubman Gill Injury

Shubman Gill Injury: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం (Shubman Gill Injury)పై బీసీసీఐ పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. గిల్ మెడ పట్టేసిందని, అందుకే అతను మైదానం వీడాల్సి వచ్చిందని బోర్డు తెలిపింది. బీసీసీఐ సమాచారం ప్రకారం.. మెడికల్ టీమ్ గిల్‌ను పర్యవేక్షిస్తోంది. అతని పరిస్థితిని బట్టి అతను ఈ రోజు బ్యాటింగ్‌కు దిగుతాడా లేదా అనేది నిర్ణయించబడుతుంది.

నిజానికి గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్వీప్ షాట్ ఆడగా ఆ సమయంలోనే అతనికి మెడలో కొంత అసౌకర్యం కలిగింది. గిల్ తన మెడను ఒకవైపు నుంచి మరో వైపుకు కూడా తిప్పలేకపోవడంతో గ్రౌండ్‌ను విడిచి వెళ్లాల్సి వచ్చింది.

గిల్ గాయంపై అప్‌డేట్

శుభ్‌మన్ గిల్ గాయంపై బీసీసీఐ తన ఎక్స్ (X) ఖాతాలో అప్‌డేట్ ఇచ్చింది. భారత క్రికెట్ బోర్డు ప్రకారం.. గిల్ మెడలో కండరాల పట్టేయడం ఉంది. దీని కారణంగానే భారత కెప్టెన్ బ్యాటింగ్ మధ్యలో మైదానం వీడాల్సి వచ్చింది. గిల్ గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది.

Also Read: SBI Chairman : మళ్లీ తెరపైకి బ్యాంకుల విలీనం.. ఇక ఈ బ్యాంకులు కనిపించవా?

అయితే శుభ్‌మన్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు బ్యాటింగ్‌కు దిగుతాడా లేదా అనేదానిపై అతని ప్రస్తుత పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటారు. వాస్తవానికి గిల్ 3 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేశాడు. అప్పుడే స్వీప్ షాట్ ఆడుతున్నప్పుడు అతని మెడలో తీవ్రమైన పట్టేయడం అనుభవమైంది. గిల్ ఇబ్బంది పడటం కనిపించింది. చెకప్ కోసం ఫిజియో మైదానంలోకి రావాల్సి వచ్చింది. మైదానం మధ్యలో జరిగిన చర్చ తర్వాత శుభ్‌మన్ గ్రౌండ్‌ను విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

భారత బ్యాట్స్‌మెన్‌లు నిరాశపరిచారు

దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే ఆలౌట్ చేసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభం బాగా లేదు. యశస్వి జైస్వాల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి మార్కో జాన్సెన్ వేసిన అద్భుతమైన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నంబర్ మూడులో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా పెద్దగా ప్రభావం చూపలేక 29 పరుగులు చేసి వెనుదిరిగాడు.

గిల్ నాలుగు పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ గా వెళ్ళగా.. రిషబ్ పంత్ 24 బంతుల్లో వేగవంతమైన 27 పరుగులు చేసిన తర్వాత కార్బిన్ బాష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ 39 పరుగులు చేసి కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో మార్క్రామ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా కూడా మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేక 27 పరుగులు చేసి ఔటయ్యాడు. ధ్రువ్ జురెల్ కూడా కేవలం 14 పరుగులు మాత్రమే చేయగలిగాడు. భార‌త్ కూడా 9 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది.

Exit mobile version