Site icon HashtagU Telugu

Shreyas Iyer: శ్రేయస్ సెంచ‌రీ మిస్‌.. కార‌ణం చెప్పిన శ‌శాంక్‌!

Shreyas Iyer to Shashank Singh

Shreyas Iyer to Shashank Singh

Shreyas Iyer: గుజరాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. అయితే సెంచ‌రీ మాత్రం చేయ‌లేక‌పోయాడు. ఐపీఎల్ 2025లో తొలి సెంచరీ అయ్యర్ (Shreyas Iyer) బ్యాట్ నుంచి వస్తుందని అందరూ ఊహించారు. చివరి ఓవర్‌లో శశాంక్‌ సింగ్‌కు స్ట్రయిక్‌ వచ్చింది. ఆ ఓవర్‌లో ఏదైనా బంతికి ఒక్క పరుగు తీసుకుని పంజాబ్ కొత్త కెప్టెన్‌ని శశాంక్ స్ట్రైక్‌లోకి తీసుకురావాలని అందరూ కోరుకున్నారు. అయితే మహ్మద్ సిరాజ్‌పై ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో శశాంక్ తన తుఫాను బ్యాటింగ్ ప‌వ‌ర్ ఏంటో మ‌రోసారి చూపాడు.

శశాంక్ చివ‌రి ఓవర్లో 23 పరుగులు చేశాడు. కానీ అయ్యర్ తన సెంచరీని పూర్తి చేయలేకపోయాడు. శ్రేయాస్ మరో ఎండ్‌లో నిలబడి శశాంక్‌ పేలుడు బ్యాటింగ్‌ను చూస్తూనే ఉన్నాడు. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత శశాంక్ మాట్లాడుతూ… తొలి బంతి నుంచే షాట్లు ఆడాలని కెప్టెన్ అయ్యర్ నుంచి ఆదేశాలు అందాయని, త‌న సెంచరీ గురించి ఆలోచించవద్దని చెప్పాడు.

పంజాబ్ ఇన్నింగ్స్ తర్వాత శశాంక్ దీనిపై మాట్లాడుతూ.. ‘నా సెంచరీ కోసం చూడొద్దు. నువ్వు షాట్లు ఆడు’ అని శ్రేయస్ తనతో చెప్పారన్నారు. తన వ్యక్తిగత స్కోర్ కోసం కాకుండా జట్టు కోసం ఆలోచించిన కెప్టెన్ అయ్యర్‌ను ఫ్యాన్స్ సైతం పొగుడుతున్నారు.

Also Read: Punjab Kings: పోరాడి ఓడిన గుజ‌రాత్‌.. పంజాబ్ కింగ్స్ ఘ‌న విజ‌యం!

శశాంక్ రహస్యాన్ని బయటపెట్టాడు

ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్‌తో మాట్లాడిన శశాంక్.. ఇది మంచి అతిధి పాత్ర. శ్రేయాస్ బ్యాటింగ్ చేసే విధానం అద్భుతంగా ఉంది. నేను అతనిని డగౌట్ నుండి చూస్తున్నాను. నేను మైదానంలోకి వచ్చిన వెంటనే, శ్రేయాస్ నన్ను మొదటి బంతి నుండి భారీ షాట్లు ఆడమని అడిగాడు. త‌న‌ సెంచరీ కోసం షాట్లు ఆడవద్దని చెప్పాడు. నేను బంతిని చూస్తూ కొట్టాను. నేను బ్యాటింగ్ చేసే పొజిషన్‌లో ఆడాలంటే జట్టు, మేనేజ్‌మెంట్ నాకు మద్దతు ఇవ్వడం అవసరం. నాకు ఈరోజు అయ్య‌ర్ ఆ అవ‌కాశం ఇచ్చాడ‌ని చెప్పుకొచ్చాడు.

తొలుత బ్యాటింగ్‌కు వ‌చ్చిన పంజాబ్ బ్యాట్స్‌మెన్ ప్రభాసిమ్రన్ తొందరగానే పెవిలియన్ బాట పట్టగా.. క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ బ్యాట్ తో రచ్చ చేశాడు. అయ్యర్ గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌పై దాడి చేశాడు. ఫీల్డ్ నాలుగు మూలల్లో అనేక శక్తివంతమైన షాట్లను కొట్టాడు. శ్రేయాస్ 42 బంతులు ఎదుర్కొని 97 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో, పంజాబ్ కెప్టెన్ 5 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో చివరి ఓవర్లలో శశాంక్ 16 బంతులు ఎదుర్కొని అజేయంగా 44 పరుగులు చేశాడు. 275 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్న శశాంక్ 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో అదరగొట్టాడు.

Exit mobile version