Shafali Verma: భారత మహిళా క్రికెట్ జట్టు, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు మధ్య చెన్నైలో ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో తొలి రోజు నుంచే టీమిండియా చాలా పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం జట్టు ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ. ఈ మ్యాచ్లో షెఫాలీ వర్మ (Shafali Verma) డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది.
షెఫాలీ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించింది
టెస్టు మ్యాచ్లో తొలి రోజు షెఫాలీ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. షెఫాలీకి ఇది మొదటి టెస్ట్ మ్యాచ్. ఆమె మొదటి టెస్ట్ మ్యాచ్లోనే డబుల్ సెంచరీ చేసింది. ఈ మ్యాచ్లో షెఫాలీ 197 బంతుల్లో 205 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. తన ఇన్నింగ్స్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టింది. షెఫాలీ డబుల్ సెంచరీ సాధించడానికి 194 బంతులు తీసుకుంది. ఇప్పుడు మహిళల టెస్టు క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్మెన్గా షెఫాలీ నిలిచింది. అంతేకాకుండా మహిళల టెస్ట్ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన రెండవ భారతీయ బ్యాట్స్మెన్గా షెఫాలీ నిలిచింది. షెఫాలీ కంటే ముందు టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ చేసింది. 2002లో మిథాలీ రాజ్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Lightning Strikes: పిడుగుపాటుకు 20 మంది మృతి.. ఎక్కడంటే..?
షెఫాలీ వర్మ కంటే ముందు మిథాలీ రాజ్ మాత్రమే ఈ ఘనత సాధించింది. 2002లో ఇంగ్లండ్తో జరిగిన టౌంటన్ టెస్టు మ్యాచ్లో మిథాలీ 214 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. షెఫాలీ వర్మ 197 బంతుల్లో 23 ఫోర్లు, 8 సిక్సర్లతో 205 పరుగులు చేసింది. కాగా.. మంధాన తన ఇన్నింగ్స్లో 161 బంతుల్లో 27 ఫోర్లు, ఒక సిక్స్తో 149 పరుగులు చేసింది.
We’re now on WhatsApp : Click to Join
స్మృతి మంధాన సెంచరీ
ఈ మ్యాచ్లో స్మృతి మంధాన కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేసింది. ఈ మ్యాచ్లో మంధాన 149 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. తన ఇన్నింగ్స్లో స్మృతి మంధాన 27 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది. స్మృతికి ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం.