Site icon HashtagU Telugu

India vs Bangladesh: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. ఎందుకంటే?

BCCI Sponsorship

BCCI Sponsorship

India vs Bangladesh: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. వారు ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కనిపిస్తారు. భారతీయ అభిమానులు కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ తిరిగి టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు కనిపిస్తారని ఎదురుచూస్తున్నారు. టీమ్ ఇండియా తదుపరి వన్డే సిరీస్ ఆగస్టులో బంగ్లాదేశ్‌తో (India vs Bangladesh) జరగాల్సి ఉంది. కానీ సమస్య ఏమిటంటే? ఈ సిరీస్ షెడ్యూల్‌పై ఇప్పటివరకు ఆమోదం లభించలేదు.

ఇటువంటి ప‌రిస్థితిలో భారతీయ క్రికెట్ అభిమానులు విరాట్, రోహిత్ తిరిగి రావడానికి చాలా కాలం వేచి ఉండవలసి రావచ్చు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భారత జట్టుతో వైట్-బాల్ సిరీస్‌కు ఆమోదం తెలిపింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌లు ఆగస్టు 17, 20, 23 తేదీలలో ఆడాల్సి ఉంది. అలాగే, టీ20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆగస్టు 26, 29, 31 తేదీలలో ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ గురించి ఇటీవల BCB అధ్యక్షుడు అమినుల్ ఇస్లామ్ మాట్లాడుతూ.. BCCI ఇప్పటివరకు బంగ్లాదేశ్ పర్యటనకు అంగీకారం తెలపలేదని చెప్పారు.

Also Read: MS DHONI : ఎంఎస్ ధోని సంచలనం..‘కెప్టెన్ కూల్’ పేరిట ట్రేడ్ మార్క్ కైవసం!

ఒక బోర్డు సమావేశం తర్వాత అమినుల్ ఇస్లామ్ ఇలా అన్నారు. నేను BCCI అధికారులతో మాట్లాడాను. వారితో చర్చలు సానుకూలంగా జరిగాయి. టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పర్యటన తదుపరి నెలలో జరగాల్సి ఉంది. ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. BCCI ప్రస్తుతం భారత ప్రభుత్వం నుండి ఆమోదం కోసం వేచి ఉందని తెలిపారు.

ఒకవేళ భారత ప్రభుత్వం నుండి BCCIకి ఆమోదం లభించకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రాక తేదీ మరింత ముందుకు వెళ్లవచ్చు. టీమ్ ఇండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే ఆ తర్వాత భారత్ తదుపరి వన్డే సిరీస్ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగనుంది. ఆ సమయంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడ‌నున్నారు.