Rohit Sharma: ఈసారి వన్డే వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యం.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!

2011లో స్వదేశంలో భారత జట్టు చివరిసారిగా ప్రపంచకప్‌ ఆడినప్పుడు ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా రాబోయే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహాలకు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు.

  • Written By:
  • Updated On - August 22, 2023 / 07:41 AM IST

Rohit Sharma: భారత జట్టు ఆసియా కప్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి అక్టోబర్ 5 నుండి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)పై ఉంది. ఈసారి ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పరిస్థితిలో టీమ్ ఇండియా కూడా టైటిల్ గెలవడానికి బలమైన పోటీదారుగా ఉంది. 2011లో స్వదేశంలో భారత జట్టు చివరిసారిగా ప్రపంచకప్‌ ఆడినప్పుడు ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా రాబోయే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహాలకు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు.

2019లో చివరి వన్డే ప్రపంచకప్‌ జరిగినప్పుడు రోహిత్ శర్మ బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. రోహిత్ 9 ఇన్నింగ్స్‌ల్లో 81 సగటుతో 648 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 5 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఇప్పుడు రాబోయే వన్డే ప్రపంచకప్‌లోనూ అతడి నుంచి అలాంటి ప్రదర్శన ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. 2019 ప్రపంచకప్‌కు ముందు నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను అని ఓ ఈవెంట్‌లో రోహిత్ ఈ విషయం గురించి చెప్పాడు. నేను ఈసారి కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇదంతా మీ నమ్మకం, విశ్వాసంపై ఆధారపడి ఉంటుందన్నాడు.

Also Read: Asia Cup 2023: ఆసియ కప్ 2023 టీమిండియా జట్టు ఇదే

2019లో టైటిల్ గెలవడానికి దగ్గరగా వెళ్ళాం: రోహిత్

ప్రపంచకప్‌ గెలవాలన్నదే మనందరి కల అని రోహిత్‌ శర్మ తన ప్రకటనలో పేర్కొన్నాడు. మేము 2015, 2019లో దీన్ని చేయలేకపోయాము. కానీ నేను రెండింటిలోనూ ఆడటం ఆనందించాను. మేము 2019 సంవత్సరంలో టైటిల్ గెలవడానికి చాలా దగ్గరగా వెళ్ళాం. జట్టుగా ఈసారి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామని చెప్పుకొచ్చాడు రోహిత్. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న చెన్నై మైదానంలో ఆస్ట్రేలియాతో ఆడనుంది.