T20 World Cup: టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో విరాట్ కోహ్లీ ఓపెన‌ర్‌గా రావాలి: గంగూలీ

వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌టం అవ‌స‌ర‌మ‌ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాకు తెలిపారు.

  • Written By:
  • Updated On - April 23, 2024 / 03:28 PM IST

T20 World Cup: ట్రావిస్ హెడ్ మాదిరిగానే 40 బంతుల్లో 100 పరుగులు సాధించగల సత్తా విరాట్ కోహ్లీకి ఉందని టీమిండియా మాజీ క్రికెట‌ర్ ప్ర‌శంస‌లు కురిపించారు. వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో విరాట్ కోహ్లీ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌టం అవ‌స‌ర‌మ‌ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మీడియాకు తెలిపారు. కోహ్లి ఇటీవల రాజస్థాన్ రాయల్స్‌పై 67 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ త‌న స్ట్రైక్ రేట్ కారణంగా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.

మీడియాతో గంగూలీ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీకి కూడా 40 బంతుల్లో 100 పరుగులు చేయగల సత్తా ఉంది. నేను మొదట్లో చెప్పినట్లు భారత్‌కు ఉన్న సత్తా ప్రకారం బ్యాటింగ్‌కు వచ్చిన వెంటనే భారీ షాట్లు కొట్టాలి. ఐదు-ఆరు ఓవర్ల తర్వాత స్కోర్ ఎలా ఉంటుందో చూడ‌వ‌చ్చ‌ని అన్నారు.

టీ20 ప్రపంచకప్‌లో జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సెలక్షన్ కమిటీ, కోచ్ రాహుల్ ద్రవిడ్, రోహిత్ నిర్ణయాలు తీసుకోవాలని గంగూలీ భావిస్తున్నాడు. అయితే కోహ్లి-రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడాన్ని చూడాలనుకుంటున్న‌ట్లు గంగూలీ చెప్పాడు. అంతేకాకుండా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నాడు. సెలెక్టర్లు దీన్ని చేయాలని నేను చెప్పడం లేదు. ఎందుకంటే జట్టు కలయికకు సంబంధించి తుది నిర్ణయం వారిదేన‌ని చెప్పారు.

Also Read: Orange- Purple Cap: బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ.. బౌలింగ్‌లో చాహల్‌, ఈ ఇద్ద‌రే టాప్‌..!

ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని టీ20 ప్రపంచకప్‌లో యశస్వి జైస్వాల్ ఎంపిక గురించి అడిగినప్పుడు.. యశస్వి అద్భుతంగా రాణించ‌గ‌ల‌డు. అతను ప్రత్యేకమైన ఆటగాడని చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక ఐపీఎల్‌లోని ఒక దశ ఆధారంగా మాత్రమే ఉండకూడదని గంగూలీ అన్నాడు. ఆయన మాట్లాడుతూ.. “ ఐపీఎల్‌లో ఆట‌గాళ్ల‌ ప్రతి ప్రదర్శనను చూడాలి. మంచి జట్టుకు అనుభవం,యు యువ ఆటగాళ్ల సమతూకం ఉంటుంది. భారతదేశం అద్భుతమైన అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కలిగి ఉంది. జట్టులో యువకుల కలయిక ఉండాలి. కేవలం ఒక్క ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేయర‌ని, సెలెక్టర్లు పరిణతి చెందారని అనుకుంటున్నాను అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

We’re now on WhatsApp : Click to Join

గత ఏడాది కూడా శివమ్ దూబే మంచి ప్రదర్శన కనబరిచాడని, ఈసారి కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడని అన్నారు. కొంతకాలంగా నిరంతరాయంగా ప్రదర్శనలు ఇస్తున్నాడన్నారు. రిషబ్ పంత్, దూబే, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు నిరంతరం రాణిస్తున్నారని పేర్కొన్నారు.