ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు ఆసక్తికరంగా మారిన వేళ రాజస్థాన్ రాయల్స్ కు షాక్ తగిలింది. ఆ జట్టులో స్టార్ ప్లేయర్ హిట్ మేయిర్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. అతని భార్య డెలివరీ సమయం కావడంతో బబుల్ ను వీడి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం , సహచర ఆటగాళ్ళు ఈ విండీస్ స్టార్ ప్లేయర్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. హిట్ మేయిర్ వెళ్ళిపోతున్న సందర్భంగా గ్రాండ్ గా సెండాఫ్ పార్టీ ఏర్పాటు చేసింది.
హిట్ మేయిర్ జీవితంలో అత్యంత సంతోషకరమైన ఈ సమయాన్ని అతని భార్య, పుట్టబోయే బిడ్డతో గడపడం ఎంతో ముఖ్యమని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ట్వీట్ చేసింది. టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్, ఇంకా సాచర ఆటగాళ్ళు ఈ విండీస్ ప్లేయర్ కు శుభాకాంక్షలు తెలిపారు. బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ హిట్ మేయిర్ భారత్ కు వచ్చే అవకాశముందని రాయల్స్ యాజమాన్యం తెలిపింది. ఈ సీజన్ లో హిట్ మేయిర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ విండీస్ హిట్టర్ ఇప్పటి వరకూ 11 మ్యాచ్ లో 72.75 యావరేజ్ తో 291 పరుగులు చేశాడు.
కాగా రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో 11 మ్యాచ్ ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టిక లో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది.
Shimron Hetmyer has travelled back to Guyana early morning today for the imminent birth of his first child, but he’ll be back soon. 💗
Read more: https://t.co/cTUb3vFiNl#RoyalsFamily | @SHetmyer pic.twitter.com/u52aO9Dcct
— Rajasthan Royals (@rajasthanroyals) May 8, 2022