IPL 2024: మహిళలకు గౌరవంగా రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ

మహిళలకు గౌరవంగా రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేక పింక్ జెర్సీని విడుదల చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ ఈ ప్రత్యేక జెర్సీని ధరించి కనిపించాడు. ఏప్రిల్ 6న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఈ జెర్సీని ధరించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది.

IPL 2024: మహిళలకు గౌరవంగా రాజస్థాన్ రాయల్స్ ప్రత్యేక పింక్ జెర్సీని విడుదల చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ ఈ ప్రత్యేక జెర్సీని ధరించి కనిపించాడు. ఏప్రిల్ 6న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఈ జెర్సీని ధరించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది.

‘పింక్ ప్రామిస్’ కార్యక్రమం ద్వారా దేశంలోని మహిళలందరినీ గౌరవించేందుకు రాజస్థాన్ జట్టు ఈ జెర్సీని ధరించనుంది. ఈ బృందం ఒక వీడియోను కూడా షేర్ చేసింది. ఇందులో చాలా మంది మహిళలు ఈ కొత్త జెర్సీని ధరించి తమ జీవిత కథలను వివరిస్తున్నారు. జెర్సీపై సదరు మహిళల పేర్లు కూడా రాసి ఉన్నాయి.

ఐపీఎల్ 2024 లో రాజస్థాన్ రాయల్స్ మార్చి 24న లక్నో సూపర్ జెయింట్‌తో ఆడనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. మార్చి 28న జరిగే రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ తలపడనుంది.గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన పేలవంగానే సాగింది. టోర్నమెంట్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడగా, అందులో జట్టు 7 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టు సంజూ శాంసన్ కెప్టెన్సీలో పటిష్టంగా ఆడాలని కోరుకుంటుంది.

Also Read: Telangana : రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి – కేసీఆర్