Site icon HashtagU Telugu

Team India Tension: ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ టై.. టీమిండియాకు పెద్ద స‌మ‌స్య‌?

BCCI

BCCI

Team India Tension: ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా (Team India Tension) సెమీఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ A నుండి న్యూజిలాండ్- భారతదేశం తమ సెమీ-ఫైనల్ టిక్కెట్లను ఖాయం చేసుకోగా.. ఆస్ట్రేలియా- దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌లలో వర్షం కారణంగా గ్రూప్ B సమీకరణాలు మారిపోయాయి. వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం లేకుండా ముగియడంతో టీమ్ ఇండియా ఎవ‌రితో పోటీప‌డ‌నుందో ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది. మార్చి 2న దుబాయ్ మైదానంలో జరగనున్న గ్రూప్ దశలో భారత్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాబట్టి సెమీ ఫైనల్‌లో భారత్ ఎవరిని ఎదుర్కోగలదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గ్రూప్‌లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుందా?

రెండు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా రెండు విజయాలతో గ్రూప్‌లో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో న్యూజిలాండ్ కూడా 2 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. అయితే భారత్ కంటే మెరుగైన రన్ రేట్ కారణంగా ఆ జ‌ట్టు ముందంజలో ఉంది. ఈ గ్రూప్‌లోని చివరి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంటారు.

Also Read: Harish Rao: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై మాజీ మంత్రి హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఒక్కో గ్రూప్ నుంచి రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. గ్రూప్‌-ఎలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. అదే విధంగా గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు గ్రూప్‌-ఎలోని అగ్రశ్రేణి జట్టుతో మ్యాచ్‌ ఆడుతుంది.

సెమీ ఫైనల్స్‌లో టీమిండియా ఎవరితో ఆడుతుంది?

ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా ఇరు జట్లకు చెరోక‌ పాయింట్ లభించింది. ప్రస్తుతం గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్‌కు ఫేవరెట్‌గా పరిగణించబడుతున్నాయి. ఈ కోణంలో ఈ మ్యాచ్‌లో ఫలితం పొందడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్- ఆఫ్ఘనిస్తాన్‌ల స్థానం కూడా తేలిపోనుంది. ఇప్పుడు ఈ గ్రూప్‌లోని ఏ జట్టు అయినా సెమీ ఫైనల్స్‌కు చేరుకోవచ్చు. చివరి క్షణం వరకు ప్రత్యర్థి ముందుకు రాకపోతే సన్నద్ధత లేకపోవడం భారత్‌కు సమస్యగా మారే అవ‌కాశం పుష్క‌లంగా ఉంది.

Exit mobile version