PCB Writes Letter To BCCI: బీసీసీఐకి పీసీబీ లెట‌ర్‌.. ఈ విష‌యంపై గ‌ట్టిగానే డిమాండ్‌!

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేందుకు భార‌త్ నిరాకరించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా మానసికంగా సిద్ధమైందని తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
PCB Writes Letter To BCCI

PCB Writes Letter To BCCI

PCB Writes Letter To BCCI: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ప్రస్తుతం సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడానికి స్టేడియంల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ టీమ్ ఇండియా ఇప్పటికీ ఆడటంపై క్లారిటీ రాలేదు. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ అంగీకరించేలా పాకిస్థాన్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడు బయటకు వస్తున్న కొత్త రిపోర్టుల్లో పాకిస్థాన్ భార‌త్ (PCB Writes Letter To BCCI)ను కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్లేందుకు భార‌త్ నిరాకరించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా మానసికంగా సిద్ధమైందని తెలిసిందే. అయితే బోర్డు ఇప్పటికీ ఒక షరతుపై మొండిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్ గడ్డపై ఫైనల్ మ్యాచ్ ఆడాలని కోరుతోంది.

Also Read: Health Tips : రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నా.. ఉదయం నిద్రలేచిన వెంటనే తలనొప్పి వస్తే కారణాలు ఇవే..!

మేము మానసికంగా సిద్ధంగా ఉన్నాం: PCB

దీనికి సంబంధించి పీసీబీ అధికారి ఒకు మాట్లాడుతూ.. పీసీబీ మొదటి ఎంపిక, ప్రాధాన్యత మొత్తం ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్‌లో నిర్వహించడం. పాకిస్థాన్‌లో ఆడేందుకు తమ జట్టుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, యూఏఈలో భారత్ మ్యాచ్‌లు నిర్వహించడంపై పీసీబీ కూడా మానసికంగా సిద్ధమైందన్నారు.

లాహోర్‌లో భారత్ ఫైనల్ ఆడాలని డిమాండ్‌

ఆ అధికారి ఇంకా మాట్లాడుతూ.. భారత్ పాక్‌లో ఆడకపోయినా, ఫైనల్‌ను లాహోర్‌లో ఎలాగైనా నిర్వహించాలని పిసిబి నిర్ణయించింది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు అర్హత సాధించినా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మ్యాచ్‌ను నిర్వహించాలని ఐసీసీని పీసీబీ కోరుతోందన్నారు. టోర్నీ మొత్తానికి భారత్ పాకిస్థాన్‌కు రాలేకపోయినా, ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం లాహోర్‌లో ఆడాల్సి ఉంటుందని ఐసీసీ సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విష‌య‌మై పీసీబీ.. బీసీసీఐకి లేఖ రాసిన‌ట్లు కూడా తెలుస్తోంది. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి కారణంగా ఇరు దేశాల మధ్య విబేధాలు తలెత్తాయి. ఈ దాడిలో 175 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. దీని తర్వాత భారత్- పాకిస్తాన్ జట్లు కేవ‌లం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఆడుతున్నాయి.

  Last Updated: 20 Oct 2024, 09:50 AM IST