Site icon HashtagU Telugu

Paris 2024 Olympics: ఆగ‌స్టు 11న ఒలింపిక్స్ ముగింపు వేడుక‌.. భార‌త ప‌తాక‌ధారులుగా మ‌ను భాక‌ర్‌, పీఆర్ శ్రీజేష్‌!

Cricket in 2028 Olympics

Cricket in 2028 Olympics

Paris 2024 Olympics: పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుక జూలై 26న జరగగా.. ముగింపు వేడుక (Paris 2024 Olympics) ఆగస్టు 11న జరగనుంది. కాగా ముగింపు వేడుకల్లో భారత్ నుంచి పతాకధారుల పేర్లను భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. షూటింగ్‌లో 2 కాంస్య పతకాలు సాధించిన మను భాకర్, హాకీ టీమ్ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ ముగింపు కార్యక్రమంలో భారత్‌కు జెండా బేరర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవంలో ఈ బాధ్యతను పీవీ సింధు, శరత్ కమల్ తీసుకున్నారు.

శ్రీజేష్ భావోద్వేగానికి గురయ్యాడు

ఇద్దరు అథ్లెట్ల పేర్లను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉష ప్రకటిస్తూ.. ఫ్లాగ్ బేరర్‌గా శ్రీజేష్‌ ఎంపికైనప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. ముగింపు వేడుకలో చెఫ్-డి-మిషన్ గగన్ నారంగ్, భారత బృందం కూడా అతనితో కలుస్తుంది. మేము ఇంతకుముందు మగ జెండా బేరర్ కోసం నీరజ్ చోప్రాతో మాట్లాడాం. కానీ అతను శ్రీజేష్ పేరును ముందుకు తెచ్చాడు అని ఉష తెలిపారు.

Also Read: Chaitu – Shobitha : వేణు స్వామి కనిపిస్తే చెప్పుతో కొడతామంటున్న అక్కినేని ఫ్యాన్స్

ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు వరుసగా రెండోసారి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గతంలో టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని కూడా సాధించింది. టోక్యోలో శ్రీజేష్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈసారి కూడా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్రిటన్‌పై ఎన్నో గోల్స్‌ రాకుండా అడ్డుకున్నాడు. బ్రిటన్ జట్టు 21 సార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించగా శ్రీజేష్ ఈ దాడులను 20 సార్లు విఫలం చేశాడు. ఇక‌పోతే మను భాక‌ర్‌ గురించి చెప్పాలంటే ఈ ఈ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని, 10 మీటర్ల మిక్స్‌డ్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.