Site icon HashtagU Telugu

Mumbai Indians: ముంబై ఇండియ‌న్స్‌లో మ‌రో భారీ మార్పు

Mumbai Indians

Mumbai Indians

Mumbai Indians: IPL 2025కి ముందు జరగనున్న మెగా వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు తమ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. కోచ్, కెప్టెన్‌ను మార్చడం నుంచి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా వరకు ఫ్రాంచైజీ సిద్ధం చేస్తోంది. ఇప్పుడు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) త్వరలో కొత్త కోచ్‌ని తీసుకోబోతోంది. T20 ప్రపంచ కప్ 2024 విజేత భారత జట్టుకు కోచ్‌గా ఉన్న వ్య‌క్తిని ముంబై త‌న జ‌ట్టులోకి తీసుకోనుంది. దీనిపై ముంబై ఇండియ‌న్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

MI కొత్త బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే!

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్, పరాస్ మాంబ్రే ముంబై ఇండియన్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా మారారు. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. పరాస్ చాలా కాలం పాటు టీమిండియా బౌలర్లకు కోచ్‌గా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా బౌలర్లను పరాస్ సిద్ధం చేశాడు.

Also Read: RSS Chief : దళితులు, అట్టడుగు వర్గాలను హిందువులు కలుపుకుపోవాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్

నివేదిక ప్రకారం.. మాజీ భారత బౌలింగ్ కోచ్ ఐదు సార్లు ఛాంపియన్ జట్టు కోసం కొత్త పాత్రలో లసిత్ మలింగ, TA శేఖర్‌తో చేరనున్నారు. మాంబ్రే ప్రమేయం ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు. కానీ అత‌ను జ‌ట్టుతో క‌ల‌వ‌టం ఖాయ‌మ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.

MI గత సీజన్‌లో పేలవమైన ప్రదర్శనను కనబరిచింది

IPL 2024లో పేలవమైన ప్రదర్శన తర్వాత ముంబై ఇండియన్స్ IPL 2025లో తిరిగి రావాలనుకుంటోంది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ బౌలింగ్ దాడికి నాయకత్వం వహిస్తున్నారు. టీమ్ ఇండియాలో ఉన్న రోజుల నుండి బుమ్రాతో మాంబ్రే అనుబంధం IPL 2025లో అతని ప్రదర్శనను మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.