Pahalgam Terror Attack: జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ లోయలో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 2:45 గంటలకు జరిగిన ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) 27 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విరాట్ కోహ్లీ స్పందన
విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ దాడిని ఖండిస్తూ “పహల్గామ్లో నిరపరాధులపై జరిగిన దారుణమైన దాడి నన్ను తీవ్రంగా కలిచివేసింది. బాధిత కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం కోసం ప్రార్థిస్తున్నాను. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను” అని రాశారు.
Also Read: Ursa Organization: వైసీపీ అవాస్తవాలను ఖండించిన ఉర్సా సంస్థ!
Instagram story of Virat Kohli for Pahalgam incident. 🙏 pic.twitter.com/y5KeQaOWtE
— Johns. (@CricCrazyJohns) April 23, 2025
గౌతమ్ గంభీర్ హెచ్చరిక
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన X ఖాతాలో ట్వీట్ చేస్తూ “ప్రియమైనవారిని కోల్పోయిన వారి కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ దాడికి బాధ్యులైన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. భారత్ దీనికి తగిన సమాధానం ఇస్తుంది” అని హెచ్చరించారు.
Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam
— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025
యువరాజ్ సింగ్ దిగ్భ్రాంతి
భారత మాజీ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ ఈ దాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. “పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడి నన్ను తీవ్రంగా బాధించింది. ఈ దాడి బాధితుల కోసం ప్రార్థిస్తున్నాను. మానవత్వం, ఆశ కోసం ఒక్కటిగా నిలబడాలి” అని పేర్కొన్నారు.
హర్భజన్ సింగ్ ఖండన
మాజీ ఆఫ్-స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన పోస్ట్లో “ఈ నీచమైన చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి. ఈ దాడిని క్షమించడం సాధ్యం కాదు” అని రాశారు.
ఈ దాడి బాధ్యతను లష్కర్-ఎ-తొయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) స్వీకరించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. నలుగురు ఉగ్రవాదులు ఇద్దరు విదేశీయులు, ఇద్దరు స్థానికులు ఈ దాడిలో పాల్గొన్నారు. ఉగ్రవాదులు బాధితుల పేర్లు, మతాన్ని అడిగి, కొందరిని కలిమా చదవమని బలవంతం చేసినట్లు నివేదికలు తెలిపాయి. దాడి తర్వాత ఉగ్రవాదులు పరారీలో ఉన్నారు. సైన్యం విస్తృత శోధన కార్యకలాపాలు చేపట్టింది.
ప్రభుత్వం చర్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను మధ్యలో ఆపి భారత్కు తిరిగి వచ్చారు. ఏప్రిల్ 23న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. కేంద్ర గృహమంత్రి అమిత్ షా శ్రీనగర్లో బాధితులకు నివాళులర్పించి, గాయపడినవారిని సందర్శించారు. దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేయబడింది.