Site icon HashtagU Telugu

ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌.. టాప్‌-5లో ఒక భార‌తీయుడు మాత్ర‌మే!

ICC

ICC

ICC T20 Rankings: ఐసీసీ టీ-20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో (ICC T20 Rankings) భారీ మార్పు చోటు చేసుకుంది. ఇద్దరు భారత బౌలర్లు భారీ నష్టాలను చవిచూడగా, కివీస్ జట్టు ఆటగాడు 7 స్థానాలు ఎగబాకాడు. ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌లో ప్రపంచం నలుమూలల నుంచి ఆటగాళ్లు పాల్గొంటున్నారు. IPL సందర్భంగా ICC మార్చి 26న కొత్త ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో T-20 ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్లు భారీ నష్టాన్ని చవిచూశారు. న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీకి భారీ ప్రయోజనం లభించింది. పాకిస్థాన్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో డఫీ అద్భుత ప్రదర్శన చేశాడు. 30 ఏళ్ల బౌలర్ 13 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఐసీసీ నుంచి రివార్డు అందుకున్నాడు.

ఐసీసీ కొత్త ర్యాంక్‌ను విడుదల చేసింది

ఐసీసీ టీ-20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఇద్దరు భారత బౌలర్లు త‌మ స్థానాల‌ను చేజార్చుకున్నారు. రవి బిష్ణోయ్ ఏడో స్థానం నుంచి ఆరో స్థానానికి వ‌చ్చాడు. అతను 1 స్థానం మెరుగుపర్చుకున్నాడు. అదే సమయంలో అర్ష్‌దీప్ సింగ్ కూడా ఒక స్థానం కోల్పోయాడు. తొమ్మిదో స్థానం నుంచి పదో స్థానానికి చేరుకున్నాడు. అర్ష్‌దీప్‌ టాప్‌ 10లో ఉండ‌గా.. న్యూజిలాండ్‌ బౌలర్‌ జాకబ్‌ డఫీ 7 స్థానాలు ఎగబాకాడు. 694 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు.

Also Read: Mobile Phone in Toilet: మొబైల్ ఫోన్ వాడుతూ టాయిలెట్‌కు వెళ్తున్నారా.. బాబోయ్‌.. మీరు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

ICC T-20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అకిల్ హోసేన్ 707 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉండగా, వరుణ్ చక్రవర్తి రెండవ స్థానంలో ఉన్నారు. అతనికి 706 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఆదిల్ రషీద్ 705 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన వానిందు హసరంగా 700 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆడమ్ జంపా, జాకబ్ డఫీ చెరో 694 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

Exit mobile version