Virat Kohli Row: రోజురోజుకీ మరింత ముదురుతున్న కోహ్లీ, గంభీర్ నవీన్ ల వివాదం?

కోహ్లీ,గంభీర్, నవీన్ ల మధ్య జరిగిన గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. రోజురోజుకీ ఈ వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. అసలు ఏం జరిగిందంటే..

  • Written By:
  • Publish Date - May 7, 2023 / 07:15 PM IST

కోహ్లీ,గంభీర్, నవీన్ ల మధ్య జరిగిన గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. రోజురోజుకీ ఈ వివాదం ఇంకా ముదురుతూనే ఉంది. అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల మే 1వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ,నవీన్, గంభీర్ ల మధ్య ఒక పెద్ద గొడవ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. మొదట ఫీల్డ్ లో ఉన్నప్పుడు కోహ్లీ నవీన్ ల మధ్య చిన్న గొడవ మొదలయ్యింది. ఆ తర్వాత మ్యాచ్ ముగిశాక కరచాలనం చేస్తున్నప్పుడు ఆ వివాదం కాస్త మరింత ముదిరింది. తర్వాత కైల్ మేయర్స్ తో కోహ్లీ మాట్లాడుతుండగా గంభీర్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ మరింత తీవ్రమైంది.

అలా కోహ్లీ, గంభీర్ ల మధ్య మాట మాట పెరిగి గొడవ పెద్దది కావడంతో మండిపడిన బీసీసీఐ కోహ్లీ గంభీర్ లకు మ్యాచ్ ఫీజులో నూరు శాతం జరిమానాన్ని కూడా విధించింది. అయితే మామూలుగా ప్లేయర్స్ ఫీల్డ్ లో గొడవ పడిన తర్వాత వెంటనే వారి మధ్య విభేదాన్ని పరిష్కరించుకుంటారు. కానీ కోహ్లీ,గంభీర్ నవీన్ ల మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రోజురోజుకీ ఆ వివాదం మరింత ముదురుతూనే ఉంది. నేరుగా కాకపోయినా సోషల్ మీడియా వేదిక పరోక్షంగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. మొదట్లో ఇంస్టాగ్రామ్ లో కోహ్లీ నవీన్ పరస్పర పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరొకసారి కోహ్లీ రెచ్చగొట్టే విధంగా నవీన్ మరోసారి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

 

గంభీర్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. మీతో ఇతరులు ఎలా వ్యవహరించాలని కోరుకుంటున్నారో.. మీరు కూడా వారితో అలాగే వ్యవహరించండి.. మీతో ఇతరులు ఎలా మాట్లాడాలి అనుకుంటున్నారో.. మీరు కూడా వారితో అలాగే మాట్లాడండి అని రాసుకొచ్చాడు నవీన్. తాజాగా నవీన్ చేసిన పోస్టుతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. నవీన్ పెట్టిన పోస్ట్ పై స్పందించిన గంభీర్ నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు,నిన్ను నువ్వు ఎప్పుడూ మార్చుకోకు అంటూ కోహ్లీకు చురకలు అంటించే విధంగా నవీన్ కు మద్దతు తెలుపుతూ కామెంట్స్ చేశాడు.