Site icon HashtagU Telugu

MS Dhoni: ఐపీఎల్ 2025కి ముందు ధోని కీల‌క నిర్ణ‌యం.. ఏంటంటే?

Useful Tips

Useful Tips

MS Dhoni: 43 ఏళ్లు పూర్తి చేసుకున్న ఎంఎస్ ధోని మరోసారి ఐపీఎల్‌లో (MS Dhoni) అలరించనున్నాడు. ఈ టోర్నీ ప్రారంభానికి ముందే ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2025కి ముందు దిగ్గజ బ్యాట్స్‌మెన్ MS ధోని పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇది చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఉత్తేజకరమైన వార్త వస్తోంది. CSKతో మరో సీజన్‌కు సన్నాహకంగా ధోనీ తన బ్యాట్ బరువును కొంచెం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడు. బౌలర్ల బంతులను మైదానం వెలుపలికి పంపేందుకు ధోని తరచుగా భారీ బ్యాట్‌ను ఉపయోగిస్తాడు. అయితే ఈ సీజన్‌లో అలా జరగక‌పోచ్చు.

న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం.. MS ధోని IPL 2025 కోసం తన బ్యాట్ బరువును 20 గ్రాములు తగ్గించబోతున్నాడు. ధోని తన అండర్-19 రోజుల నుండి దాదాపు 1200 గ్రాముల బ్యాట్‌ని ఉపయోగించడం అలవాటు చేసుకున్నాడు. అతని బ్యాటింగ్ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటికీ అతను 1300 గ్రాముల బ్యాట్‌ను ఉపయోగించాడు.

Also Read: 1984 Anti Sikh Riots: కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్‌కు జీవితఖైదు.. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సంచలన తీర్పు

ఐపీఎల్ 2025 కోసం ధోనీ తన బ్యాట్ బరువును తగ్గించుకున్నాడు

నివేదిక ప్రకారం.. మీరట్‌కు చెందిన క్రికెట్ తయారీ కంపెనీ సాన్స్‌పెరిల్స్ గ్రీన్‌ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ధోనీకి నాలుగు బ్యాట్‌లను డెలివరీ చేసింది. ఈ విషయాన్ని చెన్నై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ధృవీకరించాడు. ధోనీకి ఇచ్చిన బ్యాట్ దాదాపు 1230 గ్రాముల బరువు ఉంటుందని, దాని ఆకారం కూడా మునుపటిలానే ఉందని ఆ వర్గాలు తెలిపాయి.

త్వరలో ధోనీ జట్టుతో కలిసి శిక్షణ ప్రారంభించనున్నాడు

ఫిబ్రవరి చివర్లో అతను జట్టులో చేరతాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అతని శిక్షణ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. శిక్షణకు సంబంధించి సీఎస్‌కే యాజమాన్యం మార్చి 9 వరకు ఎంఏ చిదంబరం స్టేడియంను వినియోగించుకోలేమని తెలిపింది. ఎందుకంటే IPL 2025 దృష్ట్యా BCCI స్టేడియంను అద్భుతమైన స్థితిలో నిర్వహించాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చింది.