Site icon HashtagU Telugu

Mohammed Shami: ఇంగ్లాండ్‌తో రెండో టీ20.. మ‌హ్మ‌ద్ ష‌మీ దూరం, కార‌ణ‌మిదే?

Mohammed Shami

Mohammed Shami

Mohammed Shami: కోల్‌కతా వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ పోరులో టీం ఇండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌ని చూసి అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami)కి ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాలేదు. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా మహ్మద్ షమీ ఆడటం కష్టమని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం కూడా వెలుగులోకి వస్తోంది.

చెన్నై మ్యాచ్‌లో షమీ ఆడటం కష్టమే!

మహ్మద్ షమీ చాలా కాలం తర్వాత టీమ్ ఇండియాకు తిరిగి వచ్చాడు. కానీ ఈ బౌలర్ మొదటి మ్యాచ్ ఆడలేకపోయాడు. ఆ తర్వాత షమీ రెండో టీ20 మ్యాచ్‌లో ఆడగలడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ష‌మీ ఆడ‌టంపై జ‌ట్టు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే చెన్నై ప్లేయింగ్ ఎలెవన్‌కి కూడా షమీ దూరంగా ఉండే అవ‌కాశం ఉంది. మొదటి T20 మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్‌ను జట్టుకు దూరంగా ఉంచారు. దీనికి అతని ఫిట్‌నెస్ కార‌ణ‌మ‌ని ఊహాగానాలు వ‌చ్చాయి.

Also Read: Jay Shah: డ‌బ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు జై షాకు కొత్త బాధ్యత!

అయితే, జట్టు కాంబినేష‌న్ కారణంగా ష‌మీ త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అయితే చెపాక్‌లో ఫాస్ట్ బౌలర్లకు పెద్దగా సహాయం లభించనందున షమీ చెన్నై మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండ‌వ‌చ్చు. ఇలాంటి పరిస్థితిలో మరోసారి అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ప్రధాన ఫాస్ట్ బౌలర్లుగా మారవచ్చు.

వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కవచ్చు

రెండో టీ20 జనవరి 25న జరగనుంది. ఈ మ్యాచ్‌లో స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కవచ్చు. చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలమైనది కాబట్టి ఈ నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంది. ఒకవేళ సుందర్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం వస్తే.. ఏ ఆటగాడు తప్పుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.