Site icon HashtagU Telugu

MI vs SRH: వాంఖ‌డే స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీని చిత్తు చేసిన ముంబై!

MI vs SRH

MI vs SRH

MI vs SRH: ముంబై ఇండియన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను (MI vs SRH) వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓడించింది. హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసి 162 పరుగులు చేసింది. దీనిని ముంబై 19వ ఓవర్‌లో 4 వికెట్లు మిగిలి ఉండగా సాధించింది. ఈ మ్యాచ్ రెండు జట్లకు ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచడానికి కీలకమైంది. మిడిల్ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ 52 పరుగుల భాగస్వామ్యం ముంబై విజయంలో పెద్ద పాత్ర పోషించింది.

ముంబైకి 163 పరుగుల లక్ష్యం

ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో 163 పరుగుల లక్ష్యం లభించింది. దీనికి బదులుగా ముంబై ఇండియ‌న్స్‌ చాలా వేగంగా ఆరంభించారు. మొదటి 4 ఓవర్లలో ఎక్కువ బంతులను రోహిత్ శర్మ ఆడాడు. అతను 16 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇది IPL 2025లో రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా. అతని భాగస్వామి రియాన్ రికల్టన్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు.

Also Read: Belt Shop : బెల్టు షాపు ఈ రేంజ్ లో కొట్టుకోవాలా తమ్ముళ్లు..?

ఆ తర్వాత విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ 52 పరుగుల భాగస్వామ్యంతో ముందుకు సాగారు. దీనితో ముంబైకి విజయం సులభంగా కనిపించింది. అయితే కేవలం 7 పరుగుల వ్యవధిలో సూర్యకుమార్ యాదవ్ (26), విల్ జాక్స్ (36) తమ వికెట్లను కోల్పోయారు.

విజయం కోసం తపించిన ముంబై

ముంబై 128 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. విజయానికి ఇంకా 35 పరుగులు అవసరం ఉన్నాయి. హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కలిసి 34 పరుగులు జోడించారు. కానీ ముంబైకి విజయానికి కేవలం ఒక్క పరుగు అవసరమైనప్పుడు హార్దిక్ 21 పరుగుల వద్ద ఔటయ్యాడు. ముంబై 17.1 ఓవర్లలో 162 పరుగులు చేసింది. రెండు జట్ల స్కోరు సమానమైంది. విజయానికి ముంబైకి ఒక్క పరుగు మాత్రమే అవసరం. ఈ చివరి పరుగు చేయడానికి ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ 7 బంతులు వెచ్చించారు. ఈ క్రమంలో 2 పెద్ద వికెట్లను కోల్పోయారు. చివరకు 19వ ఓవర్ మొదటి బంతికి తిలక్ వర్మ జీషాన్ అన్సారీ బంతికి ఫోర్ కొట్టి ముంబైకి 4 పరుగుల తేడాతో విజయాన్ని అందించాడు.