Site icon HashtagU Telugu

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో భారీ మార్పులు..?

PCB Writes Letter To BCCI

PCB Writes Letter To BCCI

Champions Trophy: భారత జట్టు ఇటీవల శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడింది. టీ20 సిరీస్‌లో టీమిండియా 3-0తో, వన్డే సిరీస్‌లో శ్రీలంక 2-0తో విజయం సాధించింది. వన్డే సిరీస్‌తో పాటు, ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)కి టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. కానీ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఇది కొంత ఆందోళన కలిగించే విషయం. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇటువంటి పరిస్థితిలో టీమ్ ఇండియా తన ప్రదర్శనలో చాలా మార్పులు చేయగలదని ఓ నివేదిక పేర్కొంది.

టీమ్ ఇండియా నెల రోజుల విరామం

శ్రీలంక టూర్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు నెల రోజుల విరామం తీసుకోనుంది. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీం ఇండియా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో జట్టు తగిన విధంగా సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీమిండియా తదుపరి సిరీస్ సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టీమ్ ఇండియా విరామంలో ఉంటుంది.

Also Read: Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారతీయ అథ్లెట్ల ప్రత్యేక రికార్డులివే..!

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియా షెడ్యూల్

వన్డే మ్యాచ్‌లపై ప్రత్యేక దృష్టి సారించిన భారత్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు త‌క్కువ వన్డే మ్యాచ్‌లు ఆడబోతుండడం ఆసక్తికరం. శ్రీలంకతో ఇప్పటికే మూడు వన్డేలు పూర్తి చేసిన టీమిండియా.. జనవరిలో ఇంగ్లండ్‌తో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వన్డేలకు సన్నద్ధం కావడానికి టీమిండియా చాలా త‌క్కువ‌ మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతోపాటు భారత జట్టు పలు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఇందులో బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాతో స్వదేశంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఉన్నాయి. ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టు ఆడే పెద్ద సిరీస్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

We’re now on WhatsApp. Click to Join.