Site icon HashtagU Telugu

Rishabh Pant: 2024లో కేఎల్ రాహుల్.. ఇప్పుడు రిషబ్ పంత్!

Rishabh Pant, LSG Owner Sanjiv Goenka

Rishabh Pant, LSG Owner Sanjiv Goenka

Rishabh Pant: ఐపీఎల్ 2025లో మంగ‌ళ‌వారం ల‌క్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సీజన్-18లో వరుసగా రెండో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ల‌క్నో కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) మరోసారి నిరాశపరిచాడు. అయితే పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన చేశాడు. పంత్ ఫామ్ లేకపోవడం జట్టు ఆందోళనను పెంచింది. పంజాబ్ చేతిలో ఓడిన తర్వాత ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా ఇరు జట్ల కెప్టెన్లను కలిశారు.

పంత్‌తో సీరియస్‌గా కనిపించిన సంజీవ్ గోయెంకా

ఇప్పటివరకు సీజన్-18లో ల‌క్నో సూపర్ జెయింట్స్ 3 మ్యాచ్‌లు ఆడింది. అందులో పంత్ జట్టు 2లో ఓడి, ఒకటిలో గెలిచింది. పంజాబ్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిన తర్వాత.. ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషభ్ పంత్‌తో తీవ్రంగా చర్చిస్తూ కనిపించారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు సంజీవ్ గోయెంకా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో కూడా సంభాషించారు. అయితే ఈ సమయంలో ఆయన సంతోషంగా కనిపించారు. ఈ మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ పంత్ విఫలమైతే, పంజాబ్ కెప్టెన్ అయ్యర్ హిట్‌గా నిలిచారు. కాగా 2024లో ఓ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత అప్పటి లక్నో కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌తో సంజీవ్ ఇలానే మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో నెటిజన్లు అప్పుడు రాహుల్, ఇప్పుడు పంత్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Chiranjeevi : మొన్న వెంకటేష్.. ఇప్పుడు చిరంజీవి.. ఆ విషయంలో అనిల్ రావిపూడి ప్లానింగ్ మాములుగా లేదుగా..

పంత్ ఎల్‌ఎస్‌జీ టెన్షన్‌ను పెంచాడు

రిషభ్ పంత్ ఐపీఎల్ 2025లో అత్యధిక ధర పలికిన ఆటగాడు. ల‌క్నో సూపర్ జెయింట్స్ మెగా వేలంలో పంత్‌ను 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పటివరకు పంత్ తన ప్రదర్శనతో జట్టును, అభిమానులను నిరాశపరిచాడు. మొదటి మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడగా, పంత్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో 15 రన్స్ చేశాడు. ఇప్పుడు పంజాబ్‌తో మ్యాచ్‌లో కేవలం 2 రన్స్‌తో ఔటయ్యాడు.