Site icon HashtagU Telugu

Kho Kho World Cup: ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన భార‌త పురుషుల‌, మ‌హిళ‌ల ఖో- ఖో జ‌ట్లు!

Kho Kho World Cup

Kho Kho World Cup

Kho Kho World Cup: ఖో ఖో ప్రపంచకప్ 2025లో (Kho Kho World Cup) భారత పురుషుల, మహిళల జట్లు అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాయి. శనివారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళలు ఏకపక్షంగా 66-16తో దక్షిణాఫ్రికాను ఓడించారు. వరుసగా ఆరో మ్యాచ్ లోనూ గెలిచి ఫైనల్ టికెట్ దక్కించుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు ఉగాండాను 89-18తో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించిన నేపాల్ జట్టుతో తలపడనుంది.

రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ జనవరి 19 న జరుగుతుంది. ఇందులో భారతీయ మహిళలు మొదటిసారిగా ఖో ఖో ప్రపంచ కప్ ట్రోఫీపై తమ పేర్లను రాయాల‌ని భావిస్తున్నారు. మరోవైపు మహిళల కంటే కొంచెం ఆలస్యంగా పురుషులు కూడా చరిత్ర సృష్టించారు. భారత పురుషుల ఖో ఖో జట్టు కూడా సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై 62-42తో విజయం సాధించింది. తాజాగా 72-20 తేడాతో ఇరాన్‌ను ఓడించిన‌ నేపాల్‌తో ఫైనల్‌లో తలపడనుంది.

Also Read: Sri Reddy: వైసీపీ అభిమాని అయినందుకు సిగ్గుప‌డుతున్నా.. శ్రీరెడ్డి సంచ‌ల‌నం

పురుషుల జట్టు అటాక్, డిఫెన్స్‌ను ప్రదర్శించింది

పురుషుల జ‌ట్టు టాస్‌ ఓడిపోయినప్పటికీ.. అటాక్‌, డిఫెన్స్‌లో అద్భుత ప్రదర్శనతో భారత పురుషుల జట్టు సెమీఫైనల్‌ను పూర్తిగా తమ ఖాతాలో వేసుకుంది. 20 పాయింట్లు సాధించిన దక్షిణాఫ్రికా పేరిట తొలి టర్న్ వచ్చినా.. రెండో టర్న్‌లో భారత అటాకర్లు అద్భుతంగా రాణించి 28 పాయింట్లు సాధించి మ్యాచ్‌పై పట్టు ప్రారంభించారు. , దీని తర్వాత దక్షిణాఫ్రికా మూడో క్వార్ట‌ర్‌లో 22 పాయింట్లు చేసి ఎదురుదాడికి దిగింది. నాలుగో క్వార్ట‌ర్‌లో భారత అటాకర్లు దక్షిణాఫ్రికా డిఫెన్స్‌ను ధ్వంసం చేసి 32 పాయింట్లు సాధించి 62-42తో మ్యాచ్‌ను గెలుచుకున్నారు.

ఆరంభం నుంచి భారతీయ మహిళలదే ఆధిపత్యం

అంతకుముందు భారత మహిళల జట్టు కూడా దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో తలపడింది. మొదటి నుంచి భారతీయ మహిళలు తమ పట్టును నిలబెట్టుకున్నారు. టాస్ గెలిచిన కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే ప్రతి మలుపులోనూ అద్భుతంగా ఆడి డ్రీమ్ పరుగులతో పాయింట్లు సాధించింది. అయితే అందుకు భిన్నంగా దక్షిణాఫ్రికా జట్టు భారత డిఫెన్స్ ముందు పాలిపోయినట్లు కనిపించింది. భారత మహిళలు 66-16తో సులభంగా గెలిచారు.