Kho-Kho World Cup 2025: ఖో-ఖోలో తిరుగులేని భార‌త్‌.. విజేత‌గా నిలిచిన పురుషుల జ‌ట్టు

టీమ్ ఇండియా మూడు ట‌ర్న్‌ల్లో నేపాల్‌పై ఆధిక్యంలో నిలిచింది. నాల్గవ టర్న్‌లో కూడా అలాంటిదే కనిపించింది. టీమ్ ఇండియా 54-36 తేడాతో విజయం సాధించింది.

Published By: HashtagU Telugu Desk
Kho-Kho World Cup 2025

Kho-Kho World Cup 2025

Kho-Kho World Cup 2025: ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఖో-ఖో ప్రపంచకప్ (Kho-Kho World Cup 2025) జరుగుతోంది. ఈ ప్రపంచకప్‌లో భారత మహిళల, పురుషుల జట్ల ఆధిపత్యం కనిపించింది. నేపాల్‌ను ఓడించి మహిళల జట్టు ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. అదే సమయంలో పురుషుల జట్టు కూడా నేపాల్‌ను ఓడించి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. టోర్నీలో భారత పురుషుల జట్టు అజేయంగా నిలిచింది. టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా 54-36 తేడాతో నేపాల్‌ను ఓడించింది.

టీమ్ ఇండియా పటిష్టంగా ఆరంభించింది

ఖో-ఖో ప్రపంచ కప్ 2025 పురుషుల ఫైనల్ మ్యాచ్‌లో భార‌త్‌ అద్భుతంగా ప్రారంభమైంది. ఈ సమయంలో తొలి టర్న్‌లో 26 పాయింట్లు చేసి నేపాల్ జట్టుకు ఖాతా తెరిచే అవకాశం కూడా భార‌త్‌ ఇవ్వలేదు. రెండో టర్న్‌లో నేపాల్ జట్టు పునరాగమనానికి ప్రయత్నించి 18 పాయింట్లు సాధించింది. అదే సమయంలో టీమ్ ఇండియా 8 పాయింట్ల ఆధిక్యాన్ని కొనసాగించగలిగింది. అయితే మూడో టర్న్‌లో భారత పురుషుల ఖో-ఖో జట్టు మళ్లీ తన సత్తాను ప్రదర్శించి 50కి మించి పాయింట్లు సాధించి నేపాల్‌ను టైటిల్ మ్యాచ్ నుంచి పూర్తిగా దూరం చేసింది.

Also Read: Big Shock To BRS: ఖ‌మ్మం జిల్లాలో బీఆర్ఎస్‌కు మ‌రో భారీ షాక్‌!

నాలుగో ట‌ర్న్‌లో టీమిండియా విజయం సాధించింది

టీమ్ ఇండియా మూడు ట‌ర్న్‌ల్లో నేపాల్‌పై ఆధిక్యంలో నిలిచింది. నాల్గవ టర్న్‌లో కూడా అలాంటిదే కనిపించింది. టీమ్ ఇండియా 54-36 తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో నేపాల్‌పై టీమిండియా రెండోసారి విజయం సాధించింది. గతంలో గ్రూప్ మ్యాచ్‌లో ఇరు దేశాలు తలపడగా అందులోనూ టీమ్ ఇండియా విజయం సాధించింది. పురుషుల ఖో-ఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. అయితే పురుషుల ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు మ‌హిళ‌ల భార‌త్ జట్టు విజేత‌గా నిలిచిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

  Last Updated: 19 Jan 2025, 09:41 PM IST