Jay Shah: స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఏ ఫార్మాట్లోనూ భారత జట్టుకు కెప్టెన్గా లేరు. చివరికి ఐపీఎల్లో కూడా ఆయన ముంబై ఇండియన్స్కు సారథ్యం వహించడం లేదు. అయినప్పటికీ ఐసీసీ ఛైర్మన్ జై షా ఇటీవలే ఒక కార్యక్రమంలో రోహిత్ను ‘కెప్టెన్’ అని సంబోధించారు. దీని వెనుక ఉన్న ప్రత్యేక కారణాన్ని కూడా ఆయన అభిమానులకు వివరించారు. ఈ సందర్భంగా ‘హిట్మ్యాన్’పై ప్రశంసల జల్లు కురిపించిన జై షా, టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చారు.
రోహిత్ శర్మపై జై షా ప్రశంసల వర్షం
నీతా అంబానీ నిర్వహించిన ‘యునైటెడ్ ఇన్ ట్రయంఫ్’ అనే వేడుకలో ప్రపంచకప్ గెలిచిన జట్లను గౌరవించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జై షా, రోహిత్ను తన కెప్టెన్ అని పిలిచారు. దీనికి గల కారణాన్ని వివరిస్తూ.. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే భారత్ రెండు ప్రధాన టైటిళ్లను టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకుందని గుర్తు చేశారు.
Also Read: టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!
Jay Shah 🗣️: “our captain Rohit Sharma is sitting here. I am still calling you captain because under you, we won two ICC trophies”.
Jay Shah is grateful to Rohit Sharma for ending the drought of ICC trophies for India 🥹🇮🇳pic.twitter.com/7xjVZdjkwQ
— Kusha Sharma (@Kushacritic) January 8, 2026
జై షా మాట్లాడుతూ.. “మా కెప్టెన్ ఇక్కడే కూర్చుని ఉన్నారు. నేను ఆయనను కెప్టెన్ అనే పిలుస్తాను. ఎందుకంటే మీ సారథ్యంలోనే భారత్ రెండు ట్రోఫీలను సాధించింది. 2023లో వరుసగా 10 విజయాల తర్వాత మేము అభిమానుల హృదయాలను గెలుచుకున్నాం. కానీ ట్రోఫీని గెలవలేకపోయాము. అయితే ఫిబ్రవరి 2024లో నేను రాజ్కోట్లో చెప్పినట్లుగానే.. ఈసారి మేము హృదయాలతో పాటు కప్పును కూడా గెలుచుకున్నాము” అని కొనియాడారు.
కెప్టెన్గా రోహిత్ శర్మ ప్రస్థానం
రోహిత్ శర్మ డిసెంబర్ 2021లో భారత వన్డే జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు. గణాంకాల ప్రకారం ఆయన ప్రదర్శన ఇలా ఉంది. వన్డే ఫార్మాట్లో మొత్తం 56 వన్డే మ్యాచ్లకు సారథ్యం వహించగా.. అందులో 42 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. కేవలం 12 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. ఆయన కెప్టెన్సీలో భారత్ 2018 ఆసియా కప్, ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిళ్లను గెలుచుకుంది.
టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో రోహిత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచారు. ఆయన నాయకత్వంలో ఆడిన 62 మ్యాచ్ల్లో 49 విజయాలు అందాయి. కెప్టెన్గా ఆయన విన్నింగ్ పర్సంటేజ్ 79.03%గా ఉంది. ఆయన సారథ్యంలోనే భారత్ 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ (2024) కైవసం చేసుకుంది.
