Rohit Sharma : స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ? మహారాష్ట్ర బీజేపీలో చేరాలనే ఆసక్తితో ఆయన ఉన్నారా ? ఈక్రమంలోనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో భేటీ అయ్యారా ? అనే కోణంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఇటీవలే టెస్ట్ క్రికెట్కు గుడ్ బై ప్రకటించిన రోహిత్.. మంగళవారం రోజు మహారాష్ట్ర సీఎంతో సమావేశం అయ్యారు. ఈ మీటింగ్లో ఏయే అంశాలపై చర్చ జరిగింది ? అనే సమాచారం బయటికి రాలేదు. కానీ రోహిత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారమైతే మొదలై పోయింది.
It was great to welcome, meet and interact with Indian cricketer Rohit Sharma at my official residence Varsha. I extended my best wishes to him on his retirement from Test cricket and for continued success in the next chapter of his journey!@ImRo45#Maharashtra #Mumbai… pic.twitter.com/G0pdzj6gQy
— Devendra Fadnavis (@Dev_Fadnavis) May 13, 2025
Also Read :Floating Houses : భూకంపం వస్తే గాల్లో తేలే ఇళ్లు.. టెక్నాలజీ రెడీ
మహారాష్ట్ర సీఎం ట్వీట్లో ఏముందంటే..
మంగళవారం రోజు తనను రోహిత్ శర్మ కలిసిన అనంతరం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్(Rohit Sharma) ఒక ట్వీట్ చేశారు. ‘‘నా అధికారిక నివాసం వర్షలో భారత క్రికెటర్ రోహిత్ శర్మను కలిసినందుకు సంతోషంగా ఉంది. ఆయనతో మాట్లాడాను. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ రిటైర్మెంట్ గురించి మేం మాట్లాడుకున్నాం. రోహిత్ కెరీర్ ప్రయాణంలోని తదుపరి అధ్యాయంలోనూ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. రోహిత్కు నా శుభాకాంక్షలు తెలియజేశాను’’ అని ఫడ్నవిస్ పేర్కొన్నారు. రోహిత్ తదుపరి కెరీర్ అధ్యాయం.. రాజకీయమే అయి ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Also Read :BSF Jawan Returned : బీఎస్ఎఫ్ జవాన్ను అప్పగించిన పాక్.. ఇలా దారికొచ్చింది!
రోహిత్ శర్మ.. పాలిటిక్స్ ఎక్కడి నుంచి ?
- రోహిత్ శర్మ వయసు ప్రస్తుతం 38 ఏళ్లు. ఆయన 1987 సంవత్సరం ఏప్రిల్ 30న జన్మించారు.
- రోహిత్ శర్మ మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించారు.
- టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన ముంబై ఇండియన్స్ టీమ్ తరఫున ఐపీఎల్లో ఆడుతున్నారు.
- రోహిత్ తల్లి పూర్ణిమా శర్మ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వాస్తవ్యురాలు.
- రోహిత్ తండ్రి గురునాథ్ శర్మ మహారాష్ట్రలోని థానేలో ఉన్న దోంబివ్లీ వాస్తవ్యులు.
- రోహిత్ ముంబైలోని బోరివలీలో ఉన్న తన తాత గారి ఇంట్లో పెరిగాడు. అక్కడే అతడి విద్యాభ్యాసం జరిగింది.
- ఆయన కెరీర్లో ఎక్కువ భాగం మహారాష్ట్రతోనే ముడిపడి ఉంది. అందుకే ఒకవేళ పాలిటిక్స్లోకి రావాలని రోహిత్ డిసైడ్ అయితే తప్పకుండా మహారాష్ట్ర నుంచే రాజకీయ బరిలోకి దిగే అవకాశం ఉంటుంది.