IPL 2023: ఐపీఎల్ 2023 (IPL 2023)లో ఫైనల్తో సహా కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సీజన్లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ మే 26న జరుగుతుంది. ఆపై ఫైనల్ మే 28 ఆదివారం జరుగుతుంది. బుధవారం లక్నో, ముంబై మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. ఈ విజయం తర్వాత లక్నో ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ ను స్వీట్ మ్యాంగో చిత్రాన్ని పంచుకోవడం ద్వారా ముంబై ఇండియన్స్కు చెందిన కొంతమంది ఆటగాళ్లు పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నారు.
మే 9న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా నవీన్-ఉల్-హక్ ఒక ప్లేట్లో కొన్ని మామిడి పండ్లు కనిపించే పిక్ ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ చిత్రంలో అతను “స్వీట్ మ్యాంగో” అని రాశాడు. దీని తర్వాత నవీన్ సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురయ్యాడు. దీని తర్వాత RCB టోర్నమెంట్ నుండి నిష్క్రమించినప్పుడు నవీన్ స్టోరీ షేర్పై జట్టును పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్నాడు.
The sweet mangoes! pic.twitter.com/BM0VCHULXV
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 24, 2023
Also Read: LSG vs MI Eliminator: రోహిత్ సేన ఆల్ రౌండర్ షో.. ముంబై దెబ్బకు లక్నో ఔట్
ఇప్పుడు ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా నవీన్-ఉల్-హక్ను లక్ష్యంగా చేసుకుంది. వాస్తవానికి ముంబై ఆటగాళ్ళు విష్ణు వినోద్, కుమార్ కార్తికేయ, సందీప్ వారియర్ Instagram ద్వారా ఒక పోస్ట్ను పంచుకున్నారు. అందులో ముగ్గురు ఆటగాళ్లు కొన్ని మామిడికాయలతో టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ముగ్గురు ముంబై ఆటగాళ్లు కూడా చిత్రంలో వేర్వేరు పోజులు ఇచ్చారు. ఈ పోస్ట్ను షేర్ చేస్తూ.. “ది స్వీట్ మ్యాంగోస్” అని క్యాప్షన్లో వ్రాయబడింది. మామిడి పండ్లను పెట్టి ‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’ అన్న స్టైల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ఫోటో నెట్టింట వైరల్ గా మారుతోంది. ఈ ఫోటోను ముంబై ఆటగాడు సందీప్ వారియర్ తన ట్విటర్ లో పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేశాడు. అయితే అంతకుముందే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఎలిమినేటర్లో ఓడిన లక్నో
ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్ రెండోసారి ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ గత సంవత్సరం (IPL 2022) కూడా ఎలిమినేటర్కు చేరుకుంది. కానీ ఆ సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈసారి జట్టు ముంబై చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.