Site icon HashtagU Telugu

India vs Pakistan: రాణించిన పాక్ బ్యాట్స్‌మెన్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

PAK vs BAN

PAK vs BAN

India vs Pakistan: భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత ఆడుతున్న పాకిస్థాన్ (India vs Pakistan) 241 పరుగులు చేసింది. సౌద్ షకీల్ అర్ధశతకం బాదడంతో పాక్ జట్టు స్కోరు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరుని అందుకుంది. పాక్ జట్టు మ‌రోసారి స్లో బ్యాటింగ్ చేసి ఆలౌట్ అయింది. టోర్నీలో ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడిపోయింది. ఇప్పుడు భారత్‌పై గెలవాలంటే 242 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాలి.

పాకిస్థాన్ జట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌

దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ బ్యాటింగ్‌లో బాబర్ ఆజం 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇమామ్ ఉల్ హక్ కూడా 10 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 47 పరుగులకే 2 వికెట్లు పతనమైన తర్వాత మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ కలిసి పాకిస్థాన్‌కు 104 పరుగులు జోడించారు. షకీల్ 62 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read: IND vs PAK: ఒక‌వేళ భార‌త్‌, పాక్ మ్యాచ్ టై అయితే.. విజేత‌ను ఎలా ప్ర‌క‌టిస్తారు?

మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. అయితే అతను ఆ పరుగులు చేయడానికి 77 బంతులు తీసుకున్నాడు. ఈ క్రికెట్ యుగంలో రిజ్వాన్ 59.74 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడంతో పాకిస్థాన్ జట్టుకు భారీ నష్టం వాటిల్లింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పునరాగమనానికి కారణం ఇదే. ఖుష్దిల్ షా మరోసారి పాకిస్థాన్ జట్టు గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేసి 38 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు.

కుల్దీప్ విధ్వంసం సృష్టించాడు

భారత జట్టులో కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్లలో ఆధిపత్యం ప్రదర్శించాడు. 9 ఓవర్లు వేసిన యాదవ్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అతను మొదట ఫామ్‌లో ఉన్న సల్మాన్ అఘా వికెట్ తీసుకున్నాడు. అతను కేవలం 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అతను షాహీన్ అఫ్రిదీని గోల్డెన్ డక్‌ చేశాడు. 14 పరుగుల వద్ద నసీమ్ షా రూపంలో మూడవ వికెట్‌ను కుల్దీప్ తీసుకున్నాడు. భారత్‌ తరఫున హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా ఒక్కో వికెట్ తీశారు.