India vs England: భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరగనుంది. తొలి మ్యాచ్లో ఓడిన భారత జట్టు సిరీస్లో 1-0తో వెనుకంజలో ఉంది. ఇప్పుడు రెండో టెస్టుకు ముందు టీమ్ ఇండియా కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి బ్యాట్స్మెన్లు విశాఖపట్నం టెస్టు మ్యాచ్కు దూరం అయ్యారు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వంటి బ్యాట్స్మెన్ ఫామ్లో లేకపోవడం టీమ్ ఇండియాకు ఆందోళన కలిగించే అంశం. పేలవ బ్యాటింగ్ కారణంగా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 231 పరుగులు చేయలేకపోయింది.
శుభ్మన్ గిల్, అయ్యర్లకు ఇదే చివరి అవకాశం
ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమ్ ఇండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇంగ్లండ్ స్పిన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు భారత బ్యాట్స్మెన్ నెట్స్లో చెమటోడ్చుతున్నారు. రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియాలో మార్పులు కనిపించవచ్చు. విశాఖపట్నం టెస్ట్ నుండి శుభమాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ వంటి ఆటగాళ్లలో ఒకరిని తప్పించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే, టీమిండియా బ్యాటింగ్ కోచ్ ప్రకటన తర్వాత శుభ్మన్ గిల్కు మరో అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత 9 టెస్టు ఇన్నింగ్స్ల్లో గిల్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు.
Also Read: Budget: మాల్దీవుల బడ్జెట్ 3.2 బిలియన్ డాలర్లు.. భారతదేశంతో పోలిస్తే ఎంత తక్కువో తెలుసా..?
మరోవైపు శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి కూడా అలాగే ఉంది.చివరి 8-9 ఇన్నింగ్స్లో శ్రేయాస్ అయ్యర్ అర్ధసెంచరీ చేయలేదు. ఇక రెండో టెస్టులో రోహిత్ శర్మ ఏ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాడో చూడాలి. దీంతో పాటు రెండో మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా తన బ్యాటింగ్ను కాస్త మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు. మ్యాచ్లో శుభారంభం లభించిన రోహిత్ తన ఇన్నింగ్స్ను పెద్ద ఇన్నింగ్స్గా మార్చలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో రోహిత్ శర్మపై కూడా కొంత ఒత్తిడి కనిపించవచ్చు.
We’re now on WhatsApp : Click to Join