Site icon HashtagU Telugu

India vs China: హాకీ ఆసియా కప్ 2025.. చైనాపై భారత్ ఘన విజయం!

India vs China

India vs China

India vs China: హాకీ ఆసియా కప్ 2025లో భారత జట్టు అద్భుతమైన ఆరంభం చేసింది. టోర్నమెంట్‌లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా చైనాను (India vs China) 4-3 తేడాతో ఓడించి సత్తా చాటింది. ఈ విజయానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ప్రధాన కారణం. అతను అద్భుతమైన మూడు గోల్స్‌ను చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, చివరి నిమిషం వరకు చైనా ఆటగాళ్లు స్కోర్‌ను సమం చేయడానికి ప్రయత్నించారు.

మ్యాచ్ విశేషాలు

మ్యాచ్ ప్రారంభంలో చైనా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. మొదటి క్వార్టర్‌ ముగిసే సమయానికి వారు ఒక గోల్ చేసి 1-0 ఆధిక్యాన్ని సాధించారు. అయితే భారత జట్టు ఈ ఆధిక్యాన్ని ఎక్కువసేపు కొనసాగించనివ్వలేదు. రెండవ క్వార్టర్‌ ప్రారంభంలోనే జుగరాజ్ ఒక గోల్ చేసి స్కోర్‌ను 1-1తో సమం చేశాడు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండు గోల్స్ చేసి టీమిండియా ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. హాఫ్ టైం వరకు చైనా ఆటగాళ్లు గోల్ చేయడానికి ప్రయత్నించినా.. వారు విఫలమయ్యారు. దీంతో హాఫ్ టైం స్కోర్ 2-1గా నిలిచింది.

Also Read: BCCI: బీసీసీఐ అధ్యక్ష పదవికి రోజర్ బిన్నీ రాజీనామా.. బాధ్యతలు చేపట్టిన రాజీవ్ శుక్లా!

హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్

మూడవ క్వార్టర్‌ ప్రారంభం కాగానే హర్మన్‌ప్రీత్ సింగ్ తన ఫామ్ కొనసాగిస్తూ పెనాల్టీ కార్నర్‌లో గోల్ చేసి జట్టు ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. అయితే చైనా కూడా వెంటనే పుంజుకొని, ఒక గోల్ చేసి స్కోర్‌ను 3-2కి తగ్గించింది. మూడవ క్వార్టర్‌లో చైనా మరో గోల్ చేసి, స్కోర్‌ను 3-3తో సమం చేసింది. ఈ సమయంలో ఆట ఉత్కంఠగా మారింది. కానీ నాలుగవ క్వార్టర్‌లో హర్మన్‌ప్రీత్ తన మూడవ గోల్ సాధించి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. దీంతో టీమిండియా 4-3 ఆధిక్యంలోకి వెళ్ళింది. మ్యాచ్ చివరి వరకు భారత రక్షణ విభాగం ఈ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైంది.

మొత్తంగా ఈ విజయంతో భారత జట్టు టోర్నమెంట్‌లో ఘనంగా బోణీ కొట్టింది. జట్టు మొత్తం సమష్టిగా పోరాడి, ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచి, భవిష్యత్ మ్యాచ్‌లకు స్ఫూర్తినిస్తుంది.