India vs Bangladesh Day 5: బంగ్లా 146 ప‌రుగుల‌కే ఆలౌట్‌.. 95 ప‌రుగులు చేస్తే భార‌త్‌దే సిరీస్‌..!

బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు భారత్‌కు 95 పరుగుల విజయ లక్ష్యం ఉంది. జడేజాతో పాటు బుమ్రా, అశ్విన్ తలో 3 వికెట్లు తీశారు.

Published By: HashtagU Telugu Desk
India vs Bangladesh Day 5

India vs Bangladesh Day 5

India vs Bangladesh Day 5: కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్(India vs Bangladesh Day 5) మధ్య జరుగుతున్న రెండో టెస్టు చివరి అంకానికి చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 146 పరుగులకు ఆలౌట్ కాగా.. 95 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ రోజు ముగిసేలోపు ఆ లక్ష్యాన్ని ఛేదిస్తే భారత్‌దే విజయం. అశ్విన్‌, జడేజా, బుమ్రా మూడేసి వికెట్లు తీయగా.. ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

కాన్పూర్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టు బిగించింది. మ్యాచ్ చివరి రోజు బంగ్లాదేశ్ బ్యాటింగ్ ను టీమిండియా బౌలర్లు ధ్వంసం చేశారు. అశ్విన్, బుమ్రా, జడేజా ఐదో రోజు ప్రమాదకరమైన బౌలింగ్‌ను ప్రదర్శించారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా ఐదో రోజు తన స్పిన్ తో బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ను ఉచ్చులో పడేశాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ జడేజా ముందు నిల‌వ‌లేక‌పోయారు.

జడేజా ప్రమాదకరమైన బౌలింగ్

నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజాకు ఒక్క వికెట్ మాత్రమే లభించింది. కానీ జడేజా రెండో ఇన్నింగ్స్‌లో పూర్తి భిన్నమైన రిథ‌మ్‌లో కనిపించాడు. బంగ్లాదేశ్ జట్టుకు బ్యాక్ టు బ్యాక్ జడేజా భారీ షాకులు ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో జడేజా కేవలం 14 బంతుల్లో 3 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో కూడా జడేజా బంతిని అర్థం చేసుకోలేకపోయాడు. జడేజా వేసిన బంతికి శాంటో స్టంప్‌లు నేలకూలాయి.

Also Read: Smartphones Discount: పండుగ వేళ స్మార్ట్ ఫోన్ లపై అద్భుతమైన ఆఫర్స్.. తక్కువ ధరకే సొంతం చేసుకోండిలా!

కాన్పూర్ టెస్టులో జడేజా రికార్డు సృష్టించాడు

కాన్పూర్ టెస్టు నాలుగో రోజు రవీంద్ర జడేజా ఏకైక వికెట్ తీసి తన పేరిట ప్రత్యేక రికార్డును నమోదు చేసుకున్నాడు. జడేజా ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో వేగంగా 300 వికెట్లు, 3 వేల స్కోర్ చేసిన ప్రపంచంలో రెండవ క్రికెటర్ అయ్యాడు. ఇది కాకుండా ఈ విషయంలో అతను ఆసియాలో మొదటి ఆటగాడిగా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జడేజా 8 పరుగులు చేశాడు. అంతకుముందు చెన్నై టెస్టులో జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ సాధించాడు.

రెండో ఇన్నింగ్స్‌లో జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్‌ను దెబ్బ‌తీశాడు. జడేజా 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు భారత్‌కు 95 పరుగుల విజయ లక్ష్యం ఉంది. జడేజాతో పాటు బుమ్రా, అశ్విన్ తలో 3 వికెట్లు తీశారు.

  Last Updated: 01 Oct 2024, 12:48 PM IST