India Vs SA: మ‌రో టీ20 సిరీస్‌పై భార‌త్ గురి.. సౌతాఫిక్రాతో నేడు తొలి టీ20

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ విజయం ఎంజాయ్ చేయ‌కముందే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు మ‌రో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైపోయింది.

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 10:19 AM IST

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ విజయం ఎంజాయ్ చేయ‌కముందే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు మ‌రో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైపోయింది. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 పోరుకు నేడు మొద‌టి టీ20 మ్యాచ్ ఆడ‌నుంది. ఆస్ట్రేలియాపై విజ‌యం సాధించినా జోరుతోనే మ‌రో టీ20 సిరీస్ ద‌క్కించుకోవాల‌ని భావిస్తోంది టీమిండియా. అయితే రోహిత్ సేన‌ను ఆందోళ‌న‌ కలిగిస్తోన్న విష‌యం ఏమైనా ఉందంటే.. అది డెత్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్. స‌ఫారీలతో జరిగే ఈ పోరులో డెత్ ఓవ‌ర్ల‌లో రాణించి, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు పూర్తి స్థాయిలో సిద్దం అవ్వాల‌ని చూస్తోంది రోహిత్ సేన‌.

ద‌క్షాణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే మొదటి టీ20తో ఈ పొట్టి ఫార్మాట్ ప్రారంభంకానుంది. టీమిండియా కీలక బౌలర్లు హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌ లేకుండానే సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచకప్‌ నేపథ్యంలో వారికి విశ్రాంతినిచ్చారు. కరోనా వ‌ల‌న‌ ఫాస్ట్‌ బౌలర్ షమీ ఈ సిరీస్‌కూ దూరమైన విషయం తెలిసిందే. స‌ఫారీ జట్టు కూడా బలంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయ‌ని ఫ్యాన్స్ భావిస్తోన్నారు.

మ‌రోవైపు దక్షిణాఫ్రికా కూడా బలంగానే ఉంది. భార‌త్ గడ్డపై టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు దక్షిణాఫ్రికాపై భారత్‌ పైచేయి సాధించలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు గ్రూప్‌ దశలో పోటీపడనున్నాయి. టీమిండియా సౌతాఫ్రికా జ‌ట్టుతో మూడు టీ20ల సిరీస్‌, మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. తిరువ‌నంత‌పురం వేదిక‌గా భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మొద‌టి టీ20 మ్యాచ్ రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.