T20 World Cup: ఫిబ్రవరి 12 సాయంత్రం భారత్- నమీబియా మధ్య గ్రూప్-A లో కీలక పోరు జరగనుంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో టీమ్ ఇండియా తన పాత రికార్డును తానే తిరగరాసే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టుకూ సాధ్యం కాని మైలురాయిని భారత్ చేరుకోనుంది.
T20 ప్రపంచకప్లో వరుసగా 10వ విజయం సాధించే అవకాశం
ఫిబ్రవరి 7న అమెరికాను ఓడించిన ‘మెన్ ఇన్ బ్లూ’ టీ20 ప్రపంచకప్లో వరుసగా 9 విజయాలు సాధించిన తొలి జట్టుగా అవతరించింది. ఈ టోర్నీలో ఏ జట్టుకైనా ఇదే సుదీర్ఘ విజయాల పరంపర. గత ఎడిషన్లో భారత్ ఆడిన మొత్తం 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ‘సూర్యకుమార్ అండ్ కంపెనీ’ నమీబియాను ఓడిస్తే ఈ గ్లోబల్ టోర్నమెంట్లో వరుసగా 10 విజయాలు సాధించిన మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఆపై పాకిస్థాన్, నెదర్లాండ్స్పై కూడా గెలిస్తే ఈ సంఖ్య 12కు చేరుతుంది.
Also Read: గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రహస్య అణు పరీక్షలు
ఈ రెండు జట్ల పేరిట ఉన్న పాత రికార్డు
గతంలో ఆస్ట్రేలియా 2022, 2024 ఎడిషన్లలో వరుసగా 8 మ్యాచ్లు గెలిచింది. అలాగే సౌత్ ఆఫ్రికా 2024 టీ20 ప్రపంచకప్లో ఫైనల్ వరకు వరుసగా 8 మ్యాచ్లు గెలుచుకుంది. ప్రోటీస్ జట్టు విజయాల పరంపరకు టీమ్ ఇండియాయే బ్రేక్ వేసింది. ఇప్పుడు నమీబియాపై గెలిచి తన సొంత రికార్డును బద్దలు కొట్టాలని భారత్ పట్టుదలగా ఉంది.
భారత పూర్తి జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.
