IND vs AUS Head to Head: వన్డే ప్రపంచకప్ ముగిసింది.. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చిన భారత్ (IND vs AUS Head to Head) తుదిపోరులో చతికిలపడింది. ఫలితంగా ఆసీస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ బాధ నుంచి తేరుకుంటున్న టీమిండియా ఆసీస్ తో టీ ట్వంటీ సిరీస్ కు సిద్ధమవుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగా పలువురు సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతినివ్వడంతో యువక్రికెటర్లకు చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. గురువారం విశాఖపట్నం వేదికగా జరిగే తొలి మ్యాచ్ తో సిరీస్ షురూ కానుంది.
వరల్డ్ కప్ ఓటమికి రివేంజ్ తీర్చుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. గత రికార్డులను పరిశీలిస్తే టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్ దే పైచేయిగా ఉంది. ఓవరాల్ గా ఇప్పటి వరకూ ఇరు జట్ల మధ్య 26 మ్యాచ్ లు జరిగితే.. భారత్ 15 సార్లు గెలిచింది. ఆసీస్ 10 మ్యాచ్ లలో విజయం సాధిస్తే ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లలోనూ భారత్ దే పైచేయిగా ఉంది. ఇండియాలో 10 మ్యాచ్ లు జరిగితే భారత్ ఆరింటిలో విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ లలో ఆసీస్ గెలిచింది.
Also Read: world cup 2023: ప్రపంచకప్ ఫైనల్కు శరద్ పవార్ను ఆహ్వానించలేదా?
ఇదిలా ఉంటే రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ 10 టీ ట్వంటీ సిరీస్ లు జరిగాయి. సిరీస్ విజయాల్లో కూడా టీమిండియాదే పైచేయిగా ఉంది. భారత్ 5 సిరీస్ లు గెలిస్తే… ఆసీస్ మూడు గెలిచింది. రెండు సార్లు సిరీస్ లు డ్రాగా ముగిసాయి. చివరిసారిగా భారత్ గత ఏడాది ఆసీస్ పై టీ ట్వంటీ సిరీస్ గెలిచింది. కాగా సొంతగడ్డపై కుర్రాళ్ళతో బరిలోకి దిగుతున్న భారత్ కు ఆసీస్ ను ఓడించడం అంత సులభం కాకపోవచ్చు. వార్నర్ విశ్రాంతి తీసుకున్నప్పటకీ…స్మిత్ , మాక్స్ వెల్ , స్టోయినిస్ , హెడ్ , మాథ్యూ వేడ్ వంటి స్టార్ ప్లేయర్స్ ఆసీస్ జట్టులో ఉన్నారు. మొదటి మ్యాచ్ కు విశాఖ ఆతిథ్యమిస్తుండగా… మిగిలిన మ్యాచ్ లు తిరువనంతపురం, గుహావటి, రాయ్ పూర్, బెంగళూరులో జరగనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.