Iga Swiatek: వింబుల్డన్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల సింగిల్స్ ఫైనల్ శనివారం ఇగా స్వియాటెక్ (Iga Swiatek) (పోలండ్), అమండా అనిసిమోవా (యూఎస్ఏ) మధ్య జరిగింది. ఈ గొప్ప పోటీలో స్వియాటెక్ టైటిల్ను సొంతం చేసుకుని మొదటిసారి వింబుల్డన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో ప్రపంచ నంబర్ 1 క్రీడాకారిణి అరీనా సబలెంకాను ఓడించిన అనిసిమోవా.. ఫైనల్లో స్వియాటెక్ ముందు ఎక్కడా నిలబడలేకపోయింది. స్వియాటెక్ సెంటర్ కోర్టులో 6-0, 6-0తో అద్భుత విజయాన్ని సాధించడానికి కేవలం 57 నిమిషాలు మాత్రమే పట్టింది.
ఈ మ్యాచ్ లండన్లోని సెంటర్ కోర్టులో జరిగింది. 13వ సీడ్ అనిసిమోవా మొదటిసారి గ్రాండ్స్లామ్ ఫైనల్కు చేరుకుంది. ఇక నాలుగు సార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఒకసారి యూఎస్ ఓపెన్ గెలిచిన ఇగా స్వియాటెక్ కూడా మొదటిసారి వింబుల్డన్ ఫైనల్ ఆడింది.
Also Read: Ravi Shastri: ఆ బంతులు ఆ బాక్స్లో ఏం చేస్తున్నాయి.. రవిశాస్త్రి కామెంట్స్ వైరల్!
ఫైనల్ మ్యాచ్ ఇలా సాగింది!
ఇగా స్వియాటెక్ మొదటి సెట్ను 6-0తో గెలవడానికి కేవలం 25 నిమిషాలు పట్టింది. ఆమె అమండా అనిసిమోవాను లవ్ స్కోర్తో ఆపి సెట్ను ముగించింది. అనిసిమోవా 14 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేసింది. అయితే స్వియాటెక్ కేవలం 2 ఎర్రర్స్ మాత్రమే చేసింది. రెండవ సెట్లో కూడా స్వియాటెక్ ఆధిపత్యం చెలాయించి, ఒక గంట కంటే తక్కువ సమయంలోనే టైటిల్ను సొంతం చేసుకుంది.
8వ సీడ్ ఇగా స్వియాటెక్ సెమీఫైనల్లో బెలిండా బెన్సిచ్ను 6-2, 6-0తో ఓడించి ఫైనల్కు చేరుకుంది. ఇక 23 ఏళ్ల అనిసిమోవా టాప్ సీడ్ అరీనా సబలెంకాను మూడు సెట్ల పోరులో 6-4, 4-6, 6-4తో ఓడించి టైటిల్ మ్యాచ్కు ప్రవేశించింది. 2016 తర్వాత ప్రతి సంవత్సరం వింబుల్డన్లో కొత్త క్రీడాకారిణి మహిళల సింగిల్స్ గెలుస్తోంది. 2016 తర్వాత గార్బిన్ ముగురూజా (2017), ఏంజెలిక్ కెర్బర్ (2018), సిమోనా హాలెప్ (2019), యాష్ బార్టీ (2021), ఎలెనా రైబకినా (2022), మార్కెటా వోండ్రోసోవా (2023), బార్బోరా క్రెజ్సికోవా (2024) వింబుల్డన్ ట్రోఫీని గెలుచుకున్నారు. ఈ సారి కూడా వింబుల్డన్కు కొత్త మహిళా ఛాంపియన్ లభించింది. స్వియాటెక్ ఈ టైటిల్ను సొంతం చేసుకుంది.