Champions Trophy 2025 Schedule: ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. దీని తర్వాత భారత్ రెండో మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అదే సమయంలో మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది.

Published By: HashtagU Telugu Desk
PCB Chairman

PCB Chairman

Champions Trophy 2025 Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ (Champions Trophy 2025 Schedule) విడుద‌లైంది. ఐసీసీ ఈ ట్రోఫీకి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ చివరి మ్యాచ్ మార్చి 9న జరగనుంది.

టీమిండియా మ్యాచ్‌లు ఫిబ్రవరి 20 నుండి ప్రారంభం

ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. దీని తర్వాత భారత్ రెండో మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అదే సమయంలో మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మార్చి 4, 5 తేదీల్లో రెండు సెమీ-ఫైనల్‌లు ఆడనుండగా, ఫైనల్ మార్చి 9న జరుగుతుంది. ఫైనల్ కోసం రిజర్వ్ డే ఉంచారు.

Also Read: WhatsApp New Feature : ఇక వాట్సాప్‌లోనే డాక్యుమెంట్‌ స్కానింగ్‌ ఫీచర్

ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్

  • 19 ఫిబ్రవరి – పాకిస్థాన్ vs న్యూజిలాండ్, నేషనల్ స్టేడియం, కరాచీ
  • 20 ఫిబ్రవరి – బంగ్లాదేశ్ vs భారతదేశం, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
  • 21 ఫిబ్రవరి – ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, నేషనల్ స్టేడియం, కరాచీ
  • 22 ఫిబ్రవరి – ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, గడాఫీ స్టేడియం, లాహోర్
  • 23 ఫిబ్రవరి – పాకిస్తాన్ vs భారతదేశం, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
  • ఫిబ్రవరి 24 – బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
  • ఫిబ్రవరి 25 – ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
  • 26 ఫిబ్రవరి – ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
  • 27 ఫిబ్రవరి – పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి
  • 28 ఫిబ్రవరి – ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, గడాఫీ స్టేడియం, లాహోర్
  • మార్చి 1 – దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, నేషనల్ స్టేడియం, కరాచీ
  • మార్చి 2 – న్యూజిలాండ్ vs భారత్, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి?

  • మార్చి 4 – సెమీ-ఫైనల్ 1, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
  • మార్చి 5 – సెమీఫైనల్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్
  • మార్చి 9 – ఫైనల్ – గడ్డాఫీ స్టేడియం, లాహోర్

భారత్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో అతను జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడని BCCI ధృవీకరించింది.

  Last Updated: 24 Dec 2024, 06:16 PM IST