ది హండ్రెడ్ ఉమెన్స్ లీగ్‌లో టీమిండియా ప్లేయర్లపై కనకవర్షం

 The Hundred Women 2026 ఇంగ్లండ్‌లో జరిగే మహిళల ఫ్రాంచైజీ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ 2026 TheHundredAuction సీజన్‌కు జరిగిన వేలంలో భారత మహిళా క్రికెటర్లు జట్లలో చేరారు. వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ మహిళా జట్టులో ఎంపికై స్మృతి మంధానాతో మళ్లీ కలిశారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులో చేరింది. మరో భారత స్టార్ జెమిమా రోడ్రిగ్స్ సదర్న్ బ్రేవ్ జట్టుకు డైరెక్ట్ సైనింగ్‌గా వెళ్లింది. అయితే యాస్తికా భాటియా, […]

Published By: HashtagU Telugu Desk
The Hundred Women 2026

The Hundred Women 2026

 The Hundred Women 2026 ఇంగ్లండ్‌లో జరిగే మహిళల ఫ్రాంచైజీ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ 2026 TheHundredAuction సీజన్‌కు జరిగిన వేలంలో భారత మహిళా క్రికెటర్లు జట్లలో చేరారు. వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ మహిళా జట్టులో ఎంపికై స్మృతి మంధానాతో మళ్లీ కలిశారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ సన్‌రైజర్స్ లీడ్స్ జట్టులో చేరింది. మరో భారత స్టార్ జెమిమా రోడ్రిగ్స్ సదర్న్ బ్రేవ్ జట్టుకు డైరెక్ట్ సైనింగ్‌గా వెళ్లింది. అయితే యాస్తికా భాటియా, ఎన్ శ్రీ చరణి వేలంలో అమ్ముడుపోలేదు.

ఇంగ్లండ్‌లో జరిగే ది హండ్రెడ్ లీగ్ 2026 సీజన్‌కు జరిగిన వేలంలో భారత మహిళా క్రికెటర్లకు మంచి అవకాశాలు దక్కాయి. ముఖ్యంగా రిచా ఘోష్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ వంటి టీమిండియా స్టార్‌లు వివిధ జట్లకు ఎంపికయ్యారు.

వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్‌ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఉమెన్స్ జట్టు 50,000 పౌండ్లకు వేలంలో తీసుకుంది. ఈ వేలంలో మాంచెస్టర్ ఫ్రాంచైజీ మొదట బిడ్ పెట్టగా, ఇతర జట్లు పోటీకి రాకపోవడంతో ఆమెను సులభంగా తమ జట్టులో చేర్చుకుంది. దీంతో రిచా ఘోష్ మళ్లీ భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంథానతో ఒకే జట్టులో ఆడే అవకాశం వచ్చింది. ఇటీవల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ తరఫున ఇద్దరూ కలిసి ఆడుతూ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘ది హండ్రెడ్’లో కూడా వారి జంట మాంచెస్టర్ జట్టుకు బలం చేకూర్చనుంది.

మాంచెస్టర్ జట్టులో ఇప్పటికే స్మృతి మంధానా జనవరిలో డైరెక్ట్ సైనింగ్‌గా చేరింది. ఈ జట్టులో ఆస్ట్రేలియా లెజెండ్ మెగ్ లానింగ్, ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ కూడా ఉండటం విశేషం. దీంతో మాంచెస్టర్ జట్టు స్టార్ ఆటగాళ్లతో మరింత బలంగా కనిపిస్తోంది.

ఇక భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సన్‌రైజర్స్ లీడ్ జట్టు 27,500 పౌండ్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఈ ఫ్రాంచైజీ కూడా వేలంలో మొదట బిడ్ పెట్టి, ఇతర జట్ల నుంచి పోటీ లేకపోవడంతో ఆమెను జట్టులోకి తీసుకుంది. ఇంతకుముందు దీప్తి శర్మ లండన్ స్పిరిట్ ఉమెన్ జట్టుకు కీలకంగా ఆడింది. అంతర్జాతీయ టోర్నమెంట్లు, ఫ్రాంచైజీ లీగ్‌లలో అద్భుతంగా రాణిస్తూ దీప్తి శర్మ మంచి ఫామ్‌లో ఉంది.

ఇక మరో భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను సదరన్ బ్రేవ్ ఉమెన్ జట్టు 60,000 పౌండ్లకు డైరెక్ట్ సైనింగ్‌గా తీసుకుంది. ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్‌లో ఇది ఆమెకు రెండో ఫ్రాంచైజీ. ఇంతకుముందు ఆమె సన్‌రైజర్స్ లీడ్స్ మహిళా జట్టుకు కూడా ఆడింది. జెమిమా రోడ్రిగ్స్ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడి 453 పరుగులు చేసింది. అందులో నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. ఆమె అత్యధిక స్కోరు 92 నాటౌట్‌గా ఉంది.

అయితే భారత జట్టుకు చెందిన కొంతమంది ఆటగాళ్లకు ఈ వేలంలో నిరాశ ఎదురైంది. యస్తికా భాటియా 15,000 పౌండ్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చినప్పటికీ, ఏ జట్టూ ఆమెపై బిడ్ వేయలేదు. అదేవిధంగా శ్రీచరాణి కూడా 27,500 పౌండ్ల బేస్ ప్రైస్‌తో వేలంలో పాల్గొన్నప్పటికీ, ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోవడంతో అమ్ముడుపోలేదు.

 

  Last Updated: 12 Mar 2026, 11:35 AM IST