Rishabh Pant: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ ప్రస్తుతం భారతదేశంలో ఉంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL 2025)లో స్పోర్ట్స్ ప్రెజెంటర్గా పనిచేస్తున్న గ్రేస్.. ఒక భారతీయ క్రికెటర్పై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేసి వార్తల్లో నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో గ్రేస్ హేడెన్ను భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లో (Rishabh Pant) ఎవరు ఇష్టమని అడిగినప్పుడు ఆమె వెంటనే రిషబ్ పంత్ పేరును చెప్పింది. పంత్పై తనకు ప్రత్యేక అభిమానం ఉందని గ్రేస్ తెలిపింది. అయితే ఆమె వ్యాఖ్యలను పంత్ అభిమానులు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు.
రిషబ్ పంత్ కోసం నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అని గ్రేస్ పేర్కొంది. ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో పంత్ చూపించిన ధైర్యాన్ని, గాయపడినప్పటికీ బ్యాటింగ్ చేసిన తీరును ఆమె ప్రత్యేకంగా ప్రశంసించింది. ఆ పరిస్థితిలో పంత్ ప్రదర్శించిన నిబద్ధతకు ఆమె సెల్యూట్ చేసింది.
Also Read: PAK PM Shahbaz Sharif: భారత్పై పాక్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు!
ఇంగ్లాండ్పై పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్
గ్రేస్ హేడెన్ ప్రస్తావించిన ఇన్నింగ్స్ ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లోనిది. ఆ మ్యాచ్లో పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని కాలికి గాయమైంది. అయినప్పటికీ జట్టుకు అవసరమైన సమయంలో కాలి బొటనవేలుకు ఫ్రాక్చర్ ఉన్నప్పటికీ అతను కుంటుకుంటూ బ్యాటింగ్కు వచ్చి ఒక కీలకమైన అర్ధ సెంచరీని సాధించాడు. పంత్ ఆడిన ఆ ఇన్నింగ్స్ కారణంగానే భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేయగలిగింది. చివరికి ఆ మ్యాచ్ను డ్రా చేసుకోవడం సాధ్యమైంది.
રિષભ પંતની દિવાની છે આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરની દીકરી, હાલમાં DPLમાં મચાવી રહી છે ધૂમ#RishabhPant #DPL2025 #Gracehayden https://t.co/rK0FdVvuvs
— Zee 24 Kalak (@Zee24Kalak) August 14, 2025
ప్రస్తుతం గ్రేస్ హేడెన్ DPL 2025లో తన స్పోర్ట్స్ ప్రెజెంటింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో లీగ్లోని ఆటగాళ్లతో తన సంభాషణల వీడియోలను పంచుకుంటుంది. ఈ వ్యాఖ్యల ద్వారా కేవలం క్రీడాకారిణిగా కాకుండా ఆమె ఒక క్రికెట్ అభిమానిగా కూడా తన హృదయంలోని భావాలను అందరి ముందు వెల్లడించింది.