Golden Ticket: ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అదే సమయంలో ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. అయితే, సునీల్ గవాస్కర్ బీసీసీఐని ఒక కోరిక కోరాడు. మహేంద్ర సింగ్ ధోనీ, ఇస్రో చీఫ్లకు కూడా గోల్డెన్ టిక్కెట్లు (Golden Ticket) ఇవ్వాలని కోరుకుంటున్నట్లు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తెలిపారు. గతంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు గోల్డెన్ టికెట్ లభించింది. ప్రపంచకప్లో గోల్డెన్ టికెట్ పొందిన తొలి వ్యక్తి అమితాబ్ బచ్చన్. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ గోల్డెన్ టికెట్ ఇచ్చింది.
సునీల్ గవాస్కర్ ఏం డిమాండ్ చేశాడు?
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తర్వాత భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు గోల్డెన్ టికెట్ లభించింది. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ కూడా బంగారు టిక్కెట్ ఇవ్వాలన్నారు. ఇటీవల అతని నాయకత్వంలో భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ, ఇతర గౌరవనీయ వ్యక్తులు కాకుండా ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ కు కూడా గోల్డెన్ టికెట్ ఇవ్వాలి. ఈ జాబితాలో ఎంత మంది ఉన్నారో నాకు తెలియదని, అయితే ఇస్రో చీఫ్ ఎస్. సోమ్నాథ్కి కచ్చితంగా గోల్డెన్ టికెట్ ఇవ్వాలన్నారు.
Also Read: Sri Lanka Win: చివరి బంతికి విజయం.. పాకిస్తాన్ను ఓడించిన శ్రీలంక.. ఫైనల్ లో భారత్ తో ఢీ..!
ఈ వ్యక్తులకు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్లు
ఇటీవల బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తర్వాత భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ గోల్డెన్ టికెట్ ఇవ్వడం గమనార్హం. గవాస్కర్ బీసీసీఐ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించాడు. సంబంధిత రంగాల్లోని ప్రముఖులను గౌరవించాలని బీసీసీఐ సెక్రటరీ జై షా తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగినది. ఇండియాను చంద్రుడిపైకి తీసుకెళ్లిన ఇస్రో చీఫ్ కూడా అందులో ఉంటారని ఆశిస్తున్నాను. ఇండియాకు ఆడిన ప్రతి ఒక్కరికీ ఈ టికెట్లు ఇవ్వడం కుదరదు. ఇక ఇండియాకి వరల్డ్ కప్ అందించిన ఇద్దరు కెప్టెన్లు కూడా ఈ గోల్డెన్ టికెట్ కు అర్హులు. కపిల్ దేవ్, ఎమ్మెస్ ధోనీలకు ఈ టికెట్లు ఇవ్వాలి. ఇక ఒలింపిక్స్, వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా పేరును కూడా పరిశీలించాలని గవాస్కర్ చెప్పాడు.