Site icon HashtagU Telugu

Virat Kohli Fan: విరాట్ కోహ్లీ అభిమానిపై పోలీసులు పిడిగుద్దులు.. ఏం చేశాడో చూడండి!

Virat Kohli Fan

Virat Kohli Fan

Virat Kohli Fan: రంజీ ట్రోఫీలో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మధ్య జనవరి 30-ఫిబ్రవరి 1 మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ ఆడేందుకు వచ్చాడు. విరాట్‌ను చూసేందుకు వేలాది మంది అభిమానులు మైదానానికి చేరుకున్నారు. మూడో రోజు మ్యాచ్‌లో ఓ అభిమాని (Virat Kohli Fan) బలవంతంగా మైదానంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ గార్డు, పోలీసులు ఆ అభిమానిని కొట్టారు.

వైరల్ అవుతున్న వీడియోలో విరాట్ కోహ్లీని కలవడానికి ఒక అభిమాని అక్రమంగా మైదానంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. ఈ సమయంలో ఒక సెక్యూరిటీ గార్డు నిరంతరం ఫ్యాన్‌ను కొడుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అయినా కూడా ఆ అభిమాని గ్రౌండ్‌లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. అయితే చివరికి ఓ పోలీసు.. విరాట్‌ ఫ్యాన్‌ కాలు పట్టుకుని బారికేడ్‌పై నుంచి కిందకు లాగాడు. ఆ తర్వాత ఫ్యాన్‌పై పిడిగుద్దులు గుద్దిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ మొత్తం ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: 8th Pay Commission: బడ్జెట్‌లో 8వ వేతన సంఘం గురించి ఎందుకు ప్రకటించలేదు?

విరాట్ అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచాడు

12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఆడేందుకు వచ్చిన విరాట్ కోహ్లీ అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. భారీ ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యాడు. అతను 6 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతడిని రైల్వేస్ ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ 241 పరుగులకు ఆలౌటైంది. జట్టు తరఫున ఉపేంద్ర యాదవ్ అత్యధిక పరుగులు చేశాడు. అతను 177 బంతుల్లో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేసింది.

ఢిల్లీ తరఫున ఆయుష్ బడోని 99, సుమిత్ మాథుర్ 86 పరుగులు చేయగా ఢిల్లీ 374 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో రైల్వేస్ 114 పరుగులకు ఆలౌట్ కాగా, మూడో రోజునే ఢిల్లీ ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమైన విరాట్

విరాట్ కోహ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధం కాబోతున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్‌తో జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కూడా అతను భాగమయ్యాడు. అతను ఈ సిరీస్‌లో తన ఫామ్‌ను తిరిగి పొందాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.