Site icon HashtagU Telugu

Shreyas Iyer: శ్రేయాస్‌ అయ్యర్ సంచ‌ల‌న ప్రకటన.. గుర్తింపు రాలేద‌ని కామెంట్స్‌!

Shreyas Iyer

​Shreyas Iyer

Shreyas Iyer: టీమ్ ఇండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడంలో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలోని ప్రతి మ్యాచ్‌లోనూ అయ్యర్ టీమిండియాకు అవసరమైన పరుగులు చేశాడు. 2024 సంవత్సరం అయ్యర్‌కు క‌ష్ట‌కాల‌మ‌నే చెప్పాలి. అయ్య‌ర్‌ BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి కూడా తొలగించబడ్డాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా ఉండగా, శ్రేయాస్ అయ్యర్ మూడోసారి జట్టు ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే, దీని తర్వాత కూడా అయ్యర్‌కు ప్రత్యేక గుర్తింపు రాలేదు. అయ్యర్ నంబర్-4లో టీమ్ ఇండియా అత్యంత నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌గా నిరూపించాడు. దీనికి సంబంధించి కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా అయ్యర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ హీరో అని పిలిచాడు.

శ్రేయాస్ అయ్యర్ ఏం చెప్పారు?

అయ్య‌ర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. నిజాయితీగా చెప్పాలంటే ఇది ఒక ప్రయాణం. నా జీవితంలోని ఈ దశలో నేను చాలా నేర్చుకున్నాను. 2023 ODI ప్రపంచ కప్ ఆడిన తర్వాత నేను సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి బయటపడ్డాను. నేను ఎక్కడ తప్పు చేశాను? నేను ఏమి చేయాలి, నా ఫిట్‌నెస్‌పై ఎంత దృష్టి పెట్టాలి అనే విషయాలను మళ్లీ అంచనా వేసుకున్నాను. నా శిక్షణ, నా నైపుణ్యాలపై దృష్టి పెట్టడం ప్రారంభించాను అని పేర్కొన్నారు. అయ్యర్ ఇంకా మాట్లాడుతూ.. దేశీయ క్రికెట్‌లో వరుసగా మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చినప్పుడు ఫిట్‌నెస్ నాకు ఎంత ముఖ్యమో నేను గ్రహించాను. మొత్తంమీద నేను నాతో చాలా సంతోషంగా ఉన్నాను అని తెలిపారు.

Also Read: RK Roja : ఇక రోజా వంతు వచ్చింది..ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై ప్రభుత్వం ఫోకస్

ఐపిఎల్‌లో కెకెఆర్‌ను ఛాంపియన్‌గా చేసిన తర్వాత అయ్యర్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. దాని గురించి అతను ఇలా అన్నాడు. “నేను ఐపీఎల్ ఆడుతున్నందున ఎటువంటి నిరాశ లేదు. నా ప్రధాన దృష్టి ఐపీఎల్‌ను గెలవడంపైనే ఉంది. కృతజ్ఞతగా నేను గెలిచాను. ఐపీఎల్‌ గెలిచిన తర్వాత నేను కోరుకున్నంత గుర్తింపు రాలేదని నేను వ్యక్తిగతంగా భావించాను అని అయ్య‌ర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రేయాస్ అయ్యర్ టీమ్ ఇండియా 4వ స్థానంలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను అందించాడు. ఈ టోర్నీలో అయ్యర్ 5 మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేస్తూ 243 పరుగులు చేశాడు. లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై చేసిన 79 పరుగులే అతని అత్యుత్తమ స్కోరు. ఫైనల్ మ్యాచ్‌లో అయ్యర్ తన బ్యాట్‌తో 48 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు శ్రేయాస్ అయ్యర్‌ను కొనుగోలు చేసింది. దీంతో పాటు పంజాబ్ కింగ్స్ అయ్యర్‌ను కెప్టెన్‌గా చేసింది. ఇప్పుడు అయ్యర్ 18వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కనిపించనున్నాడు.