Dhoni surprise: ధోని సింప్లిసిటీపై కుష్బూ కామెంట్స్…

మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. దేశానికి రెండు ప్రపంచ కప్ లు అందించిన ధోని సింప్లిసిటీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

Dhoni surprise: మాజీ టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. దేశానికి రెండు ప్రపంచ కప్ లు అందించిన ధోని సింప్లిసిటీకి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక్కోసారి ధోని చిన్నపిల్లాడిలా మారిపోతారు. తాజాగా ధోని ప్రముఖ నటి ఇంటికి వెళ్లి సందడి చేశాడు. ఆమె మరెవరో కాదు అందాల భామ నటి కుష్బూ. ప్రస్తుతం ధోని చెన్నై తరుపున ఆడుతున్నాడు. అయితే కాస్త విశ్రాంతి దొరకడంతో ధోని కుష్బూ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా కుష్బూ అత్తగారు ధోనీని చూసి సర్ ఫ్రైస్ గా ఫీల్ అయ్యారు. ధోనీని హక్కును చేర్చుకుని ఆప్యాయంగా ముద్దాడారు.

ధోనితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కుష్బూ. హీరోలు తయారవ్వరు… పుడతారంటూ క్యాప్షన్ తో పోస్ట్ చేసిందామె. ధోనీని మా అత్తగారు అమితంగా ఇష్టపడతారు. ధోనీ మా ఇంటికి రావడం పట్ల నాకు మాటలు రావడం లేదు. ధోనీ మా అత్తగారి ఆయుషుని ఇంకాస్త పెంచారు. ఇప్పుడామె చాలా సంతోషంగా ఉంది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కు ఓ విజిల్ అంటూ తన సంతోషాన్ని తెలియజేశారు. కుష్బూ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ కి నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ఘనత ధోనీది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సత్తా చాటుతుంది. ఈ సీజన్లో రెండు మ్యాచులు గెలిచి, ఒక మ్యాచ్ ను చేజార్చుకుంది. అయితే ధోనీ ఆట కొనసాగుతుంది. చివరి మ్యాచులో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్ ఓడినప్పటికీ ధోనీ మూడు సిక్సర్లతో సత్తా చాటాడు. ఈ నెల 17న బెంగుళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

Read More: MS Dhoni: ఎంఎస్ ధోనీపై షాకింగ్ కామెంట్స్.. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అంటూ కారణాలు చెప్పిన జాదవ్..!