ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టీ20 మ్యాచ్ల్లో నాలుగువేల పరుగులు పూర్తి చేశాడు. బుధవారం ముంబైలో రాజస్థాన్ రాయల్స్పై 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ఈ మ్యాచ్లో ఆడిన రిషబ్ పంత్ టీ20ల్లో 4000 పూర్తి చేయడంతో తన కెరీర్లో మరో విజయాన్ని సాధించాడు.బుధవారం రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ను ఎనిమిది వికెట్ల తేడాతో గెలవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్లకు తమ జట్టును పోటీలో ఉంచారు. రిషబ్ పంత్ కెప్టెన్సీ కూడా చాలా ప్రశంసలు అందుకుంది.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయవలసి రావడంతో రాజస్థాన్ ఆరు వికెట్లు కోల్సోయి 160 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే 161/2కి చేరుకుంది. రెండు లీగ్ గేమ్లు మిగిలి ఉండగానే ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ 12 పాయింట్లతో.. మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ 14 పాయింట్లతో ఉన్నాయి.