Site icon HashtagU Telugu

England Win Series: ఇంగ్లాండ్ దే చివరి టీ ట్వంటీ .పాక్ పై సీరీస్ కైవసం

England Imresizer

England Imresizer

పాకిస్థాన్ తో జరిగిన ఏడు మ్యాచ్ ల టీ ట్వంటీ సీరీస్ ను ఇంగ్లాండ్ 4-3 తేడాతో కైవసం చేసుకుంది. చివరి టీ ట్వంటీలో 67 పరుగుల తేడాతో ఆతిథ్య పాక్ ను చిత్తు చేసింది.మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 209 పరుగులు చేసింది.

39 పరుగులకు 2 వికెట్లు కోల్పోయినా…డేవిడ్ మలాన్ , డకెట్ , బ్రూక్స్ మెరుపులతో భారీ స్కోరు సాధించింది. మలాన్ 47 బంతుల్లో 7 ఫోర్లు , 3 సిక్సర్లతో 78 రన్స్ చేయగా… డకెట్ 19 బంతుల్లో 30 , బ్రూక్స్ 29 బంతుల్లో 1 ఫోర్ , 4 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. భారీ లక్ష్య చేధనలో పాకిస్థాన్ పెద్దగా పోటీ ఇవ్వలేక పోయింది. అంచనాలు పెట్టుకున్న బాబర్ అజాం, రిజ్వన్ నిరాశ పరిచారు. మసూద్ హాఫ్ సెంచరీతో పోరాడినా…మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు.

దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లను 142 పరుగులే చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ 3 , విల్లీ 2 వికెట్లు పడగొట్టారు. ఏడు మ్యాచ్ ల సీరీస్ హోరాహోరీగా సాగింది. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ , తర్వాత పాకిస్థాన్…మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ , నాలుగు, అయిదు మ్యాచ్ లలో పాకిస్థాన్ గెలిస్తే… ఆరు, ఏడు మ్యాచ్ లలో గెలిచిన ఇంగ్లాండ్ సీరీస్ కైవసం చేసుకుంది.