MI vs LSG: మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నవీన్-ఉల్-హక్ బౌండరీకి సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, ప్రేక్షకులు కోహ్లీ-కోహ్లీ అని నినాదాలు చేయడం ప్రారంభించారు. దీనిపై నవీన్ ఆసక్తికరంగా స్పందించాడు. ఇంకా పెద్దగా అరవాలని ప్రేక్షకులని కోరాడు. దీంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విశేషమేమిటంటే ఐపీఎల్ 49వ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత గంభీర్, కోహ్లీ మధ్య గొడవ అయింది. తాజాగా ముంబై మరియు ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కోహ్లి అవుట్ అయిన తర్వాత నవీన్ సోషల్ మీడియాలో మామిడి భోజనం ఆనందిస్తున్న అంటూ పోస్ట్ చేశాడు. దానికి కోహ్లీ కూడా స్పందించాడు. కోహ్లి ఇన్స్టా స్టోరీలో వీటన్నింటికీ నాకు సమయం లేదు అని సింబాలిక్ రూపంలో పోస్ట్ పెట్టాడు.
Lucknow crowd Teases Naveen ul haq with kohli kohli chants 😂🔥#ViratKohli pic.twitter.com/r3o7f5BHIr
— Cricpedia. (@_Cricpedia) May 17, 2023
మంగళవారం జరిగిన మ్యాచ్లో కోహ్లీ అభిమానులు కోహ్లీ కోహ్లీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బౌండరీకి దగ్గరగా నిలబడిన నవీన్ను ప్రేక్షకులు స్లెడ్జ్ చేశారు. దీనిపై కోహ్లి పేరును మరింత బలంగా వినిపించాలని నవీన్ ప్రేక్షకులకు సూచించాడు. దీంతో ఫాన్స్ నవీన్ ని రెచ్చగొడుతూ స్టేడియం దద్దరిల్లేలా నినాదాలతో మోత మోగించారు. కోహ్లీతో పెట్టుకుంటే అంట్లుంటది మరి అంటూ కోహ్లీ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read More: Hansika Hormone Injection: హన్సిక హార్మోన్స్ ఇంజక్షన్ : వాస్తవమెంత ?