టీ20 వరల్డ్కప్కు అంతా సిద్ధమవుతున్న వేళ టీమిండియా నుంచి బుమ్రా దూరమైనట్లు తెలుస్తోంది. వెన్నుఫ్రాక్చర్ కారణంగా బుమ్రా టీ20 ప్రపంచకప్ నుంచి దూరమయ్యాడు. ఈ గాయానికి సర్జరీ అవసరం లేకున్నా.. 4 నుంచి 6 నెలల విశ్రాంతి తప్పనిసరి అని డాక్టర్లు సూచించారు. ఈ సమయంలో బుమ్రా ఎలాంటి ప్రయాణాలు చేయకూడదని డాక్టర్లు పేర్కొన్నారు.
జస్ప్రిత్ బుమ్రా లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీ ఆడిన భారత జట్టు సూపర్-4 స్టేజీ నుంచి వైదొలిగింది. మరోసారి జస్ప్రిత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైతే.. టీమిండియాకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న బుమ్రా మంగళవారం కూడా ప్రాక్టీస్ సమయంలో వెన్నునొప్పి వచ్చినట్లు ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ మెడికల్ బృందం అతన్ని పరీక్షిస్తోంది. బుమ్రా వెన్నెముకపై తీవ్రమైన ఒత్తిడి పడడంతో అతనికి కనీసం 4-6 నెలల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
దీంతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరమైన బుమ్రా వచ్చే ఏడాది జనవరి వరకు క్రికెట్కి దూరంగా ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం ఈ వార్తలను అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటికే మోకాలి గాయంతో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. మరి బుమ్రా స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారో చూడాలి.
🚨 UPDATE 🚨
Jasprit Bumrah complained of back pain during India's practice session on Tuesday. The BCCI Medical Team assessed him. He is ruled out of the first #INDvSA T20I.#TeamIndia
— BCCI (@BCCI) September 28, 2022